Sunil Balusu: టాలీవుడ్ నిర్మాతలపై ఓటీటీ పెత్తనం.. యంగ్ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కథానాయకుడి తల్లి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాను సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పాతో కలిసి నిర్మించారు. ఇంతకుముందు సునీల్ ‘ఓం భీమ్ బుష్’ (శ్రీ విష్ణు), ‘మా నాన్న సూపర్ హీరో’ (సుధీర్ బాబు) వంటి చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదలవుతున్న ఈ సినిమా సందర్భంగా సునీల్ బలుసు, అశోక్ వర్ధన్ ముప్పాతో జరిగిన సంభాషణలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
Film Updates : విషు పండుగ కానుకగా తమిళ్, మలయాళ సినిమాల స్పెషల్ అప్డేట్స్
Also Read
- buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
- chiranjeevi: చిరంజీవి ఫోన్ కాల్తో షాక్ అయ్యా.. ‘పెద్ది’ సక్సెస్పై మెగాస్టార్ రియాక్షన్ను రివీల్ చేసిన బుచ్చిబాబు!
- Peddi Deleted Scenes: రావు రమేష్, జగపతి బాబు సీన్లను ఎడిటింగ్లో ఎందుకు లేపేశారో చెప్పిన బుచ్చిబాబు!
- 'Peddi': టాలీవుడ్ అంటే అంత అలుసా? 'పెద్ది' విషయంలో ఇండస్ట్రీ మౌనమేల?
సినిమా విడుదల తేదీల విషయంలో ఓటీటీల నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదురవుతోందని సునీల్ అభిప్రాయపడ్డారు. అయన మాట్లాడుతూ తెలుగు సినిమాల మీద ఓటీటీల ప్రభావం ఇప్పుడు చాలా ఎక్కువగా ఉంది. విడుదల తేదీలను కూడా వారే నిర్ణయించే పరిస్థితి వచ్చింది. ఓటీటీలపై ఆధారపడి సినిమా తీస్తే నిర్మాతలకు ఇబ్బందులు తప్పవు. వారు కొన్ని ఎంచుకున్న సినిమాలను మాత్రమే కొంటారు, తమ షెడ్యూల్కు అనుగుణంగా విడుదల చేయమని చెబుతారు. ఉదాహరణకు, వేసవి సీజన్లో విడుదల చేయకుండా నాలుగైదు నెలల తర్వాత రిలీజ్ చేయమంటే సినిమాకి ఉపయోగం ఏముంటుంది? ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ విషయంలో ఓటీటీలతో చర్చలు జరిగాయి, కానీ వారు చెప్పిన తేదీలకు కట్టుబడాలని నేను భావించలేదు. అందుకే డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ అమ్మకుండా థియేటర్లలోనే మా సినిమాను విడుదల చేస్తున్నాం. థియేటర్లలో విజయం సాధించగలమనే నమ్మకం ఉంటేనే ఏ నిర్మాత అయినా సినిమా తీయాలి. ఓటీటీల మీద ఆధారపడటం సరికాదు అన్నారు. కొందరు నిర్మాతలు ఓటీటీలు ఆఫర్ చేసే డబ్బులకు ఆకర్షితులై నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీని గురించి మీ అభిప్రాయం? అని అడిగితే ఓటీటీలు ఇచ్చే డబ్బు చాలా సందర్భాల్లో సరిపోదు. ఉదాహరణకు, సినిమా బడ్జెట్కు వడ్డీలు లెక్కేస్తే, వారు ఇచ్చే మొత్తం చాలా తక్కువగా ఉంటుంది. అది నిర్మాతలకు నష్టమే. థియేటర్లలో సినిమా హిట్ అయితే, ఓటీటీ గురించి ముందుగా ఆలోచించాల్సిన అవసరమే ఉండదు. ముందుగా సినిమాను ప్రేక్షకులకు చేర్చడంపై దృష్టి పెట్టాలి అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!