Rajinikanth–Kamal Haasan Movie: రజనీకాంత్, కమల్హాసన్ మల్టీస్టారర్ లేనట్టే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజనీకాంత్, లోకనాయకుడు కమల్హాసన్లను ఒకే తెరపై చూడాలని తమిళ తంబీలు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఈ క్రేజీ కాంబినేషన్లో సినిమా రాబోతుందంటూ కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఆ కలయిక ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. మొదట, లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ, రజనీకాంత్ ‘కూలీ’ సినిమా ఫ్లాప్తో ఈ క్రేజీ కాంబినేషన్కు బ్రేక్ పడిందని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు నిరాశ చెందారు.
Also Read :TRIVIKRAM : తినడానికి తిండిలేక సునీల్.. త్రివిక్రమ్ ఏం చేశాడంటే..
Also Read
- Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
- Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్కు షాకింగ్ అప్డేట్!
- Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!
- TheyCallHimOG2 : OG -2.. నిర్మాణ భాద్యతలు ఆ రెండు సంస్థలకు?
ఈ మధ్యే మరో కొత్త విషయం తెరపైకి వచ్చింది. యువ దర్శకుడు కమ్ హీరో అయిన ప్రదీప్ రంగనాథ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని వార్తలు గుప్పుమన్నాయి. ప్రదీప్ ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ వంటి హిట్ సినిమాలతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే, ప్రదీప్ రంగనాథ్ తన తాజా చిత్రం ‘డూడ్’ ప్రమోషన్లో ఈ పుకార్లపై స్పష్టత ఇచ్చాడు. “నా దృష్టంతా ప్రస్తుతం యాక్టింగ్ పైనే ఉంది. రజనీకాంత్, కమల్హాసన్ల సినిమాకు నేను డైరెక్టర్ని కాదు,” అని తేల్చి చెప్పాడు.
ప్రదీప్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వడంతో, రజనీ-కమల్ కాంబినేషన్ మళ్లీ అటకెక్కినట్టైంది. అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ కలయిక ఇప్పట్లో ఉండకపోవచ్చని స్పష్టమైంది. ప్రదీప్ రంగనాథ్ నటించిన ‘డూడ్’ చిత్రం అక్టోబర్ 17న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది.
తాజావార్తలు
-
Drishyam 3 : అడ్వాన్స్ సేల్స్ లో దూసుకెళ్తున్న దృశ్యం 3.. మోహన్ లాల్ మరో ఇండస్ట్రీ హిట్ ఇస్తాడా?
-
Road Accident: కారు – బైక్ ఢీ.. ఐదుగురు మృతి.!
-
Kanchana4: ‘కాంచన 4’ నుండి.. ఫ్యాన్స్కు షాకింగ్ అప్డేట్!
-
Bharath Kanth: సినీ పరిశ్రమలో విషాదం.. ORR ప్రమాదంలో యువ నటుడు, సినిమాటోగ్రాఫర్ మృతి!
-
Daily Horoscope: సోమవారం దిన ఫలాలు.. వ్యాపారం, షేర్ల విషయంలో తొందరపాటు వద్దు!