ముదురుతున్న ‘మా’ వివాదం.. ‘అలయ్ బలయ్’వేదికపై కూడా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా ఎన్నికల్లో మంటలు ఇంకా చల్లారలేదు. ప్రకాశ్రాజ్, మంచు విష్ణుల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. ఎన్నికలు జరిగిన రోజు సీసీ పుటేజీ అంశం తెరపైకి వచ్చింది. పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మంచు వర్గం చెబుతుంటే… అసలు మాకు సంబందమే లేదు. స్కూల్ యాజమాన్యం సర్వర్ రూంకి తాళం ఉందని పోలీసులు ప్రకటించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి. నూతన అధ్యక్షుడిగా… మంచు విష్ణు, అతని ప్యానల్ సభ్యులు బాధ్యతలు కూడా స్వీకరించారు. అయినా ఎన్నికల సెగ మాత్రం తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తోంది. కావాలనే తమ సభ్యులపై దాడులు చేశారని అన్నారు.
Also Read
- Blackmail : వరుణ్ సందేశ్ 'బ్లాక్ మెయిల్'.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
- Peddi: పెద్ది సినిమాకి కూడా పర్సంటేజ్ కావాల్సిందే.. పట్టు పడుతున్న ఎగ్జిబిటర్లు!
- Ram Charan: బుచ్చిబాబు వల్లే నా చేతికి గాయమైంది
- Peddi Trailer Review: పెద్ది గుళ్ళో దేవుడు కాదు, గ్రౌండ్'లో దేవుడు.. ఆసక్తి రేకెత్తిస్తున్న ట్రైలర్
ఎన్నికల రోజు సీసీ పుటేజీలను తమకు ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు ప్రకాశ్రాజ్. అందుకు ఎన్నికల అధికారి కూడా అంగీకరించారు. ఇదిలా ఉండగా… సీసీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను ఖండించారు జూబ్లిహిల్స్ పోలీసులు. స్కూల్లో ఉన్న సర్వర్ రూంకి తాళం ఉందని సెలవులు కావడంతో తాళం ఇచ్చే పరిస్థితి లేదన్నారు..మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ విజయం సాధించడంతో శనివారం ప్రమాణస్వీకారం చేశారు.
తమ ప్యానల్ సభ్యులతో కలిసి ప్రమాణం చేశారు మంచు విష్ణు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొంత మంది సీనియర్ నటులపై పరోక్ష ఆరోపణలు చేశారు మోహన్ బాబు. విష్ణు ప్యానల్ గెలుపుతో తమ పదవులకు రాజీనామా చేశారు ప్రకాశ్ రాజ్ తాను రాజీనామాచేసి తన ప్యానల్ సభ్యులతో కూడా రాజీనామా చేయించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా… హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బంగారు దత్తాత్రేయ అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణుతో పాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. పవన్ కల్యాణ్ స్టేజీ మీదకు వచ్చే సమయంలో అంతా నిలుచుని నమస్కారం చేశారు… విష్ణు మాత్రం తన సీట్లో కూర్చుని కనిపించాడు. దీంతో పక్కనే ఉన్నా… చూసిచూడనట్లు వ్యవహరించారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
-
Petrol and Diesel Prices Hike: వాహనదారులకు షాక్.. మళ్లీ పెరిగిన పెట్రో ధరలు
-
Astrology: మే 19 మంగళవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!