ముదురుతున్న ‘మా’ వివాదం.. ‘అలయ్ బలయ్’వేదికపై కూడా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా ఎన్నికల్లో మంటలు ఇంకా చల్లారలేదు. ప్రకాశ్రాజ్, మంచు విష్ణుల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. ఎన్నికలు జరిగిన రోజు సీసీ పుటేజీ అంశం తెరపైకి వచ్చింది. పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మంచు వర్గం చెబుతుంటే… అసలు మాకు సంబందమే లేదు. స్కూల్ యాజమాన్యం సర్వర్ రూంకి తాళం ఉందని పోలీసులు ప్రకటించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి. నూతన అధ్యక్షుడిగా… మంచు విష్ణు, అతని ప్యానల్ సభ్యులు బాధ్యతలు కూడా స్వీకరించారు. అయినా ఎన్నికల సెగ మాత్రం తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తోంది. కావాలనే తమ సభ్యులపై దాడులు చేశారని అన్నారు.
Also Read
- Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
- Srinivasa Mangapuram: ఘట్టమనేని ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. జూలై రేస్ నుంచి తప్పుకున్న జయకృష్ణ ‘శ్రీనివాసమంగాపురం’?
- OG 2: ‘ఓజీ’ యూనివర్స్లో నేతాజీ సుభాష్ చంద్రబోస్.. సుజీత్ ప్లాన్ తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!
- Multiplex Business: రూ.200 టికెట్ కొంటే ఎవరికెంత వెళ్తుంది?.. థియేటర్లను బతికించే అసలైన హీరో ఎవరు?
ఎన్నికల రోజు సీసీ పుటేజీలను తమకు ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు ప్రకాశ్రాజ్. అందుకు ఎన్నికల అధికారి కూడా అంగీకరించారు. ఇదిలా ఉండగా… సీసీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను ఖండించారు జూబ్లిహిల్స్ పోలీసులు. స్కూల్లో ఉన్న సర్వర్ రూంకి తాళం ఉందని సెలవులు కావడంతో తాళం ఇచ్చే పరిస్థితి లేదన్నారు..మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ విజయం సాధించడంతో శనివారం ప్రమాణస్వీకారం చేశారు.
తమ ప్యానల్ సభ్యులతో కలిసి ప్రమాణం చేశారు మంచు విష్ణు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొంత మంది సీనియర్ నటులపై పరోక్ష ఆరోపణలు చేశారు మోహన్ బాబు. విష్ణు ప్యానల్ గెలుపుతో తమ పదవులకు రాజీనామా చేశారు ప్రకాశ్ రాజ్ తాను రాజీనామాచేసి తన ప్యానల్ సభ్యులతో కూడా రాజీనామా చేయించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా… హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బంగారు దత్తాత్రేయ అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణుతో పాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. పవన్ కల్యాణ్ స్టేజీ మీదకు వచ్చే సమయంలో అంతా నిలుచుని నమస్కారం చేశారు… విష్ణు మాత్రం తన సీట్లో కూర్చుని కనిపించాడు. దీంతో పక్కనే ఉన్నా… చూసిచూడనట్లు వ్యవహరించారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
Iran: 30 రోజుల్లో హార్ముజ్ తెరుచుకుంటుంది, కానీ కండిషన్స్ అప్లై..
-
T20 World Cup: ఆస్ట్రేలియాపై గెలిచినా సెమీస్ అవకాశాలు తక్కువే.. కానీ ఒక్కటే మార్గం..
-
Dokka Seethamma Mid-Day Meal : స్మార్ట్ కిచెన్స్పై క్లారిటీ.. వంట కార్మికులకు గుడ్ న్యూస్.!
-
Ravi Kishan: కూతురికి తల్లి లేని లోటు తెలియకూడదని.. మీసం తీసి, చీర కట్టేందుకు రెడీ అయిన స్టార్ విలన్!
-
CM Chandrababu : చిన్నారులే భవిష్యత్ సంపద.. ఉమ్మడి కుటుంబాలపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!