ముదురుతున్న ‘మా’ వివాదం.. ‘అలయ్ బలయ్’వేదికపై కూడా !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా ఎన్నికల్లో మంటలు ఇంకా చల్లారలేదు. ప్రకాశ్రాజ్, మంచు విష్ణుల మధ్య వ్యవహారం చిలికిచిలికి గాలివానలా మారింది. ఎన్నికలు జరిగిన రోజు సీసీ పుటేజీ అంశం తెరపైకి వచ్చింది. పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని మంచు వర్గం చెబుతుంటే… అసలు మాకు సంబందమే లేదు. స్కూల్ యాజమాన్యం సర్వర్ రూంకి తాళం ఉందని పోలీసులు ప్రకటించారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు పూర్తయ్యాయి. నూతన అధ్యక్షుడిగా… మంచు విష్ణు, అతని ప్యానల్ సభ్యులు బాధ్యతలు కూడా స్వీకరించారు. అయినా ఎన్నికల సెగ మాత్రం తగ్గడం లేదు. ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని ప్రకాశ్ రాజ్ ప్యానల్ ఆరోపిస్తోంది. కావాలనే తమ సభ్యులపై దాడులు చేశారని అన్నారు.
Also Read
- Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
- Irumudi: కథ విని రవితేజ కూతురు ఏడ్చేసింది.. సీక్రెట్స్ బయటపెట్టిన శివ నిర్వాణ!
- Sai Kumar: రవి నువ్వొక దొంగవి.. సాయికుమార్ కామెంట్స్తో నవ్వులే నవ్వులు!
- FEFSI : కోలీవుడ్లో సమ్మె సైరన్పై ఫెఫ్సీ ఆందోళన: బంద్ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని విజ్ఞప్తి!
ఎన్నికల రోజు సీసీ పుటేజీలను తమకు ఇవ్వాలని ఎన్నికల అధికారి కృష్ణ మోహన్ కు లేఖ రాశారు ప్రకాశ్రాజ్. అందుకు ఎన్నికల అధికారి కూడా అంగీకరించారు. ఇదిలా ఉండగా… సీసీ పుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారనే వార్తలు వినిపించాయి. ఈ వార్తలను ఖండించారు జూబ్లిహిల్స్ పోలీసులు. స్కూల్లో ఉన్న సర్వర్ రూంకి తాళం ఉందని సెలవులు కావడంతో తాళం ఇచ్చే పరిస్థితి లేదన్నారు..మా ఎన్నికల్లో విష్ణు ప్యానెల్ విజయం సాధించడంతో శనివారం ప్రమాణస్వీకారం చేశారు.
తమ ప్యానల్ సభ్యులతో కలిసి ప్రమాణం చేశారు మంచు విష్ణు. ఈ కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కొంత మంది సీనియర్ నటులపై పరోక్ష ఆరోపణలు చేశారు మోహన్ బాబు. విష్ణు ప్యానల్ గెలుపుతో తమ పదవులకు రాజీనామా చేశారు ప్రకాశ్ రాజ్ తాను రాజీనామాచేసి తన ప్యానల్ సభ్యులతో కూడా రాజీనామా చేయించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా… హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బంగారు దత్తాత్రేయ అలాయ్ బలాయ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు విష్ణుతో పాటు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆసక్తికర సంఘటనలు చోటుచేసుకున్నాయి. పవన్ కల్యాణ్ స్టేజీ మీదకు వచ్చే సమయంలో అంతా నిలుచుని నమస్కారం చేశారు… విష్ణు మాత్రం తన సీట్లో కూర్చుని కనిపించాడు. దీంతో పక్కనే ఉన్నా… చూసిచూడనట్లు వ్యవహరించారు పవన్ కల్యాణ్.
తాజావార్తలు
-
CJP: ఢిల్లీలో సెప్టెంబర్ 5న భారీ నిరసన మార్చ్.. మరోసారి ఆందోళనకు సిద్ధమైన విద్యార్థులు
-
Baby Nakshatra: బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ చెప్పిన ఈ విషయం తెలిస్తే కన్నీళ్లు ఆగవు.. ‘ఇరుముడి’ సెట్లో ఏం జరిగిందంటే?
-
Tamil Nadu: తీవ్ర దుమారం రేపుతోన్న పొట్టి దుస్తుల వ్యవహారం.. మంత్రి కీర్తన ఘాటు స్పందన
-
Telangana: తెలంగాణ అసెంబ్లీకి ముహూర్తం ఫిక్స్.. సెప్టెంబర్ 7 నుంచి హీట్
-
BCCI నోటిఫికేషన్ విడుదల.. 5 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు ఇవే..
ట్రెండింగ్
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్డ్రా చేస్తే పెన్షన్పై ప్రభావం..!
-
IP Ratings: IP67, IP68, IP69 అంటే ఏమిటి? స్మార్ట్ఫోన్ కొనేముందు ఈ వాటర్ప్రూఫ్ రేటింగ్స్ గురించి తప్పక తెలుసుకోండి.!
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!