Pallavi Prashanth: బెయిల్ ఇవ్వండి ప్లీజ్.. నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా కప్ గెలిచిన పల్లవి ప్రశాంత్ మీద జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ఫినాలే జరిగిన డిసెంబర్ 17వ తేదీ అన్నపూర్ణ స్టూడియో బయట పెద్ద ఎత్తున యువత మొహరించి ఉందని తెలిసి పోలీసులు బిగ్ బాస్ నిర్వాహకులకు సమాచారం ఇచ్చారు బిగ్ బాస్ కంటెస్టెంట్లను మెయిన్ గేట్ నుంచి కాకుండా వెనుక గేటు నుంచి పంపించాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో అప్పటికే కొంత మంది కంటెస్టెంట్స్ బయటకు వెళ్లిపోగా కప్పు గెలిచిన పల్లవి ప్రశాంత్ ను అన్నపూర్ణ స్టూడియోస్ వెనుక గేటు నుంచి బయటకు పంపించారు నిర్వాహకులు, ఇంటికి వెళ్లిపోమని చెబితే కప్పు గెలిచిన తాను దొంగ దారిలో వెళ్లిపోవడం ఏంటి అని భావించి పల్లవి ప్రశాంత్ మళ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వచ్చాడు.
Also Read: Salaar Overseas: 2 మిలియన్ డాలర్స్ ప్రీసేల్స్… ఆగ్ లగా దియా
Also Read
- Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
- Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
- Shiraz Mehdi: దిల్ రాజు సహా ఫిల్మ్ ఛాంబర్కు దర్శకుడు లీగల్ నోటీసులు, సీఎం రేవంత్ కు ఫిర్యాదు!
- NBK111: స్పీడ్ పెంచిన బాలయ్య .. శుక్రవారం డబ్బింగ్, అక్టోబర్ 5న కొత్త షెడ్యూల్!
అప్పటికే అక్కడ ఉన్న యువతను కంట్రోల్ చేయడం పోలీసులు వల్ల కాలేదు, దానికి తోడు పల్లవి ప్రశాంత్ కూడా రావడంతో అతన్ని అక్కడి నుంచి వెళ్ళిపోమని పోలీసులు కోరారు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది వెళ్ళిపోమని కోరుతున్న ఒక రైతు బిడ్డకు ఇంత కూడా విలువ ఇవ్వడం లేదు తనను ర్యాలీ చేస్తూనే ఇవ్వడం లేదంటూ పల్లవి ప్రశాంత్ పోలీసుల మీద ఫైర్ అయ్యాడు. అప్పటికప్పుడు ఆయనను పంపించి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్న అభిమానుల మీద పోలీసులు లాఠీఛార్జి కూడా చేశారు. ఈ నేపథ్యంలో కొంతమంది పల్లవి ప్రశాంత అభిమానులు పోలీసుల మీద దాడి చేయడం కాదు పోలీస్ వాహనాలను కూడా వంశం చేశారు. అలా జరగడానికి కారణం పల్లవి ప్రశాంత్ తమ మాట వినకుండా మళ్ళీ ర్యాలీగా రావడమేనని భావించిన పోలీసులు మామకు 9 సెక్షన్ల కింద పల్లవి ప్రశాంత్ మీద కేసులు నమోదు చేశారు. నిన్న రాత్రి గజ్వేల్ మండలంలోని పల్లవి ప్రశాంత్ స్వగృహానికి వెళ్లి అతన్ని అతని సోదరుడిని అదుపులోకి తీసుకొని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతానికి చంచల్గూడ జైలుకు తరలించారు. ఇక తాజాగా బిగ్ బాస్ -7 విన్నర్ పల్లవి ప్రశాంత్, మహావీరం కు బెయిల్ మంజూరు చేయాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇప్పటికే పల్లవి ప్రశాంత్, సోదరుడు మహావీరంకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. మధ్యాహ్నం 2.30 బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టు విచారణ జరపనుంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్లైన్ ఏర్పాటు
-
Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
-
Story Board : ‘లవ్ జిహాద్’ కోణంపై పోలీసుల ఫోకస్
-
Iran-Oman: హార్ముజ్ ఆదాయంపై ఇరాన్-ఒమన్ కీలక ఒప్పందం.. అమెరికాకు షాక్
-
Nepal-Tibet Flash Floods: కైలాస మానస సరోవర్ యాత్ర నిలిపివేత.. అన్ని మార్గాలు మూసివేత..? వెనక్కి వెళ్లిపోండి..!
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..