Nizam Exhibitors: మేం పెద్ది సినిమాని టార్గెట్ చేయలేదు.. పర్సనల్ టార్గెట్ చేశారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nizam Exhibitors: తెలుగు చిత్ర పరిశ్రమలో ఎగ్జిబిటర్లు, నిర్మాతలకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై, ముఖ్యంగా పలువురు నిర్మాతలు చేసిన ఘాటు వ్యాఖ్యలపై తెలంగాణ ఫిలిం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తాజాగా తీవ్ర స్థాయిలో స్పందించింది. నగరంలో డిస్ట్రిబ్యూటర్లు, ప్రధాన ఎగ్జిబిటర్లు అంతా కలిసి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మీడియా సమావేశం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఈ ప్రెస్ మీట్లో ఎగ్జిబిటర్లు పలు కీలక విషయాలపై కుండబద్దలు కొట్టారు. ముఖ్యంగా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారిన ‘పెద్ది’ సినిమా వివాదాన్ని తమకు ఆపాదించడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ సినిమా ఇష్యూతో తమ సంఘానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. వాస్తవాలు పూర్తిగా తెలుసుకోకుండా కొందరు నిర్మాతలు తమపై పర్సనల్ విమర్శలకు దిగడం ఏమాత్రం సబబు కాదని వారు హితవు పలికారు. ఇలాంటి ఆరోపణలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
Also Read
థియేటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన ప్రస్తుత తరుణంలో.. ‘పర్సంటేజ్ విధానం’ అమలు కోసం తాము దశాబ్దన్నర కాలంగా (2008 నుంచి) నిరంతర పోరాటం చేస్తూనే ఉన్నామని గుర్తు చేశారు. తమ డిమాండ్లు న్యాయమైనవని, ఎగ్జిబిటర్లు బాగుంటేనే సినిమా బతుకుతుందని అన్నారు. అయితే, తాము ఎప్పుడూ ఘర్షణ వాతావరణాన్ని కోరుకోలేదని.. నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య సరైన కమ్యూనికేషన్, సమన్వయం ఉండాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు. టాలీవుడ్ నిర్మాతలు ఎప్పుడు చర్చలకు ఆహ్వానించినా తాము సిద్ధంగానే ఉన్నామని, సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని వారు క్లారిటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, వ్యాపార లావాదేవీలకు సంబంధించి తలెత్తిన విభేదాలకు ముగింపు పలికేందుకు రంగం సిద్ధమైంది. రేపు ఫిలిం ఛాంబర్ వేదికగా ఒక అత్యంత కీలకమైన భేటీ జరగనుంది. ఈ మీటింగ్లో ఎగ్జిబిటర్లంతా ఏకతాటిపైకి వచ్చి తమ భవిష్యత్ కార్యాచరణపై ఒక తుది నిర్ణయం తీసుకోనున్నారు. థియేటర్ల వ్యవస్థను కాపాడుకుంటూనే, పరిశ్రమలోని అన్ని వర్గాల ప్రయోజనాలకు విఘాతం కలగకుండా, నిర్మాతలకు కూడా నష్టం జరగకుండా చూసుకుంటామని ఈ సందర్భంగా భరోసా కల్పించారు. మరి రేపటి ఛాంబర్ మీటింగ్లో ఎగ్జిబిటర్లు ఎలాంటి సంచలన నిర్ణయం తీసుకుంటారోనని ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
తాజావార్తలు
-
Saturday Holiday: ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం.. ఇక అన్ని శనివారాలు సెలవులే.. తెలంగాణలో..?
-
Sri Lanka: ఈస్టర్ బాంబు దాడి వెనుక కుట్ర.. శ్రీలంక మాజీ అధ్యక్షుడు, స్పై చీఫ్పై సంచలన ఆరోపణలు
-
SS Rajamouli: సింగీతం శ్రీనివాసరావు కోసం రాజమౌళి ఏం చేశారో చూశారా?.. లైవ్ వీడియో కాల్లో జక్కన్న సర్ప్రైజ్!
-
PM Modi: ఎన్డీఏ నేతలకు ఝుల్మురి తినిపించిన మోడీ.. వీడియో వైరల్
-
APL: మరో క్రీడా సమరానికి వేదికగా హైదరాబాద్.. అక్టోబర్ 8 నుంచే ప్రారంభం..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!