నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK111 షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ నెలలోనే ప్రారంభమైన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను ఈ ఏడాది దసరా కానుకగా విడుదల చేయాలని బాలయ్య కచ్చితమైన గడువు విధించారు. ‘పెద్ది’ చిత్రంతో నిర్మాతగా మారుతున్న వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ బ్యానర్పై ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Also Read : PEDDI : పెద్ది స్పెషల్ సాంగ్.. రామ్ చరణ్ సరసన సొగసుల సుందరి
బాలయ్య తన 112వ చిత్రం కోసం యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వివేక్ చెప్పిన కథాంశం బాలకృష్ణకు బాగా నచ్చడంతో, ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయింది. క్లాస్ మరియు వైవిధ్యమైన సినిమాలకు పేరుగాంచిన వివేక్ ఆత్రేయ, మాస్ గాడ్ బాలయ్యను ఏ రేంజ్లో చూపిస్తారో అని అభిమానుల్లో అప్పుడే ఆసక్తి మొదలైంది. ఈ చిత్రాన్ని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మించనుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది దసరా తర్వాత NBK112 రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మేకర్స్ ఈ సినిమాను సమ్మర్ 2027 కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దిల్ రాజు, నాగవంశీ వంటి ప్రముఖ నిర్మాతలు పోటీ పడినప్పటికీ చివరకు మైత్రీ మూవీ మేకర్స్ ఈ అవకాశాన్ని దక్కించుకోవడం విశేషం. సినిమాకు సంబంధించి సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ ప్రస్తుతం జరుగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటనను వచ్చే వేసవిలో గ్రాండ్గా ఇచ్చేందుకు మైత్రీ మూవీ మేకర్స్ సిద్ధమవుతోంది. బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా వివేక్ ఆత్రేయ ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సిద్ధం చేశారని సమాచారం.