HHVM : మైత్రీ, దిల్ రాజు ఔట్.. నైజాంలో ఓన్ రిలీజ్ కు నిర్మాత రెడీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఎ.ఎం. జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు. మెగా సూర్య బ్యానర్ లో ఏ ఎం రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా ఈ నెల 24న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.
విడుదలకు కేవలం తొమ్మిది రోజులు ఉన్న హరిహర వీరమల్లు థియేట్రికల్ రైట్స్ విషయంలో ఇంకా తర్జన భర్జన కొనసాగుతుంది. ఆంధ్ర వరకు ఏరియాల వారీగా ఈ సినిమాను విక్రయించారు. కానీ నైజాం ఎవరు అనే దానిపై కొద్దీ రోజలుగా గందరగోళం నెలకొంది. మొన్నటి వరకు మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూట్ చేస్తుందని టాక్ వినిపించింది. కాదు కాదు దిల్ రాజు నైజాం రైట్స్ కొనుగోలు చేసారని వార్తలు వచ్చాయి. లేటెస్ట్ గా ఆ ఇద్దరు కాదు అమెరికా సుబ్బారావు రైట్స్ దక్కించుకున్నాడు అని ఇలా రోజుకొక పేరు వినిపించింది. అసలు విషయం ఏంటని ఆరాతీయగా అసలు వాళ్ళు ఎవరు కాదు హరిహార నిర్మాత ఏ ఎం రత్నం ఈ సినిమాను నైజాంలో సొంతగా రిలీజ్ చేయబోతున్నాడని తెలిసింది. నైజాం రైట్స్ విషయంలో నిర్మాత అటు ఇటుగా రూ. 45 కోట్లు అడుగుతున్నారని సమాచారం. కానీ బయ్యర్స్ రూ. 35 నుండి 38 కోట్లు వరకు కోట్ చేసారు. అటు నిర్మాత ఇటు బయ్యర్స్ మధ్య బేరం ఎటు తెగకపోవండతో సొంతంగా రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యారు నిర్మాత ఏ ఎం రత్నం.
Also Read
తాజావార్తలు
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
-
Ram Pothineni: ‘రామ్ 23’ కోసం శ్రీనిధితో చర్చలు..!
-
IPL 2026 Playoff Scenarios: ఒక్క ప్లేఆఫ్స్ బెర్తు, ఐదు జట్ల మధ్య పోటీ.. ఆ లక్కీ టీమ్ ఎదో మరి!
-
Rishikesh Train Accident: రిషికేశ్లో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం.. దేవుడిలా కాపాడిన ఆ ఒక్క కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!