MM Keeravani: ఢిల్లీ కవాతులో కీరవాణి మ్యాజిక్.. 2500 మంది కళాకారులతో మెగా షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి.. త్వరలో ఒక అపురూపమైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. అదెంటీ అంటే దేశభక్తికి నిలువుటద్దంలా నిలిచే ‘వందేమాతరం’ గేయానికి ఆయన తనదైన శైలిలో సరికొత్తగా స్వరకల్పన చేశారు. ఈ అద్భుతమైన గీతాన్ని ఈ ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రదర్శించనున్నారు. విశేషమేమిటంటే, దేశం నలుమూలల నుండి విచ్చేసిన దాదాపు 2500 మంది కళాకారులతో కలిసి కీరవాణి ఈ గీతాన్ని ఆలపించనున్నారట. వందేమాతరం గేయం రాసి గతేడాదితో 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక బాధ్యతను కీరవాణికి అప్పగించింది. దీంతో స్వాతంత్రోద్యమ కాలం నుండి భారతీయులందరిలో స్ఫూర్తిని నింపుతున్న ఈ గేయం, కీరవాణి సంగీతంలో మరింత ప్రతిష్టాత్మకంగా వినిపించనుంది.
Also Read : Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ టీవీలో వచ్చేది ఆ రోజే!
Also Read
కాగా ఈ ప్రతిష్టాత్మక అవకాశంపై కీరవాణి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.. ‘గణతంత్ర దినోత్సవ కవాతు వంటి మహా వేడుకకు సంగీతాన్ని అందించడం, వేలమంది కళాకారులతో కలిసి దేశభక్తి గీతాన్ని పలికించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, మన దేశ గొప్పతనాన్ని, ఐక్యతను చాటిచెప్పే ఒక చారిత్రక ఘట్టం’ అని పేర్కోన్నారు. మొత్తనికి ఆస్కార్ వేదికపై తెలుగు కీర్తిని చాటిన కీరవాణి, ఇప్పుడు భారత గణతంత్ర వేడుకల్లో తన సంగీతంతో దేశ ప్రజలందరినీ ఉర్రూతలూగించబోతున్నారు. 2500 మంది గొంతుకల నుంచి ఒకేసారి వందేమాతరం వినిపిస్తుంటే ఆ అనుభూతి వర్ణనాతీతంగా ఉంటుందని సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వినూత్న ప్రదర్శన గణతంత్ర దినోత్సవ కవాతులోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తాజావార్తలు
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
-
Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!