MM Keeravani: ఢిల్లీ కవాతులో కీరవాణి మ్యాజిక్.. 2500 మంది కళాకారులతో మెగా షో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ చలనచిత్ర సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎం. కీరవాణి.. త్వరలో ఒక అపురూపమైన ఘనతను సొంతం చేసుకోబోతున్నారు. అదెంటీ అంటే దేశభక్తికి నిలువుటద్దంలా నిలిచే ‘వందేమాతరం’ గేయానికి ఆయన తనదైన శైలిలో సరికొత్తగా స్వరకల్పన చేశారు. ఈ అద్భుతమైన గీతాన్ని ఈ ఏడాది జనవరి 26న జరగనున్న భారత గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్లో ప్రదర్శించనున్నారు. విశేషమేమిటంటే, దేశం నలుమూలల నుండి విచ్చేసిన దాదాపు 2500 మంది కళాకారులతో కలిసి కీరవాణి ఈ గీతాన్ని ఆలపించనున్నారట. వందేమాతరం గేయం రాసి గతేడాదితో 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఈ ప్రత్యేక బాధ్యతను కీరవాణికి అప్పగించింది. దీంతో స్వాతంత్రోద్యమ కాలం నుండి భారతీయులందరిలో స్ఫూర్తిని నింపుతున్న ఈ గేయం, కీరవాణి సంగీతంలో మరింత ప్రతిష్టాత్మకంగా వినిపించనుంది.
Also Read : Mirai : తేజ సజ్జా ‘మిరాయ్’ టీవీలో వచ్చేది ఆ రోజే!
Also Read
- Mega brothers at Mega158 Launch: ఒకే ఫ్రేమ్లో మెగా బ్రదర్స్ .. చిరు - బాబి మూవీ ఓపెనింగ్లో ‘మెగా’ హ్యాపీనెస్
- Mega158 Launch: మెగా సంబరానికి సర్వం సిద్ధం.. చిరంజీవి - బాబి కొత్త సినిమా ఓపెనింగ్కు అతిథులుగా ఆ ఇద్దరూ!
- NTR : ఎన్టీఆర్ 'బాల రామాయణం' కంటే ముందే తాతతో కలిసి ఆ సినిమాలో నటించాడని మీకు తెలుసా?
- Prashanth Neel : ఎన్టీఆర్ బక్క చిక్కడం చూసి భయపడిపోయా.. ఎన్టీఆర్ భార్య కూడా నాపై సీరియస్ అయింది
కాగా ఈ ప్రతిష్టాత్మక అవకాశంపై కీరవాణి సోషల్ మీడియా వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు.. ‘గణతంత్ర దినోత్సవ కవాతు వంటి మహా వేడుకకు సంగీతాన్ని అందించడం, వేలమంది కళాకారులతో కలిసి దేశభక్తి గీతాన్ని పలికించడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఇది కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, మన దేశ గొప్పతనాన్ని, ఐక్యతను చాటిచెప్పే ఒక చారిత్రక ఘట్టం’ అని పేర్కోన్నారు. మొత్తనికి ఆస్కార్ వేదికపై తెలుగు కీర్తిని చాటిన కీరవాణి, ఇప్పుడు భారత గణతంత్ర వేడుకల్లో తన సంగీతంతో దేశ ప్రజలందరినీ ఉర్రూతలూగించబోతున్నారు. 2500 మంది గొంతుకల నుంచి ఒకేసారి వందేమాతరం వినిపిస్తుంటే ఆ అనుభూతి వర్ణనాతీతంగా ఉంటుందని సంగీత ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ వినూత్న ప్రదర్శన గణతంత్ర దినోత్సవ కవాతులోనే ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
తాజావార్తలు
-
iQOO Pad 6 Pro: ఐకూ ప్యాడ్ 6 ప్రో విడుదల.. 13,000mAh బ్యాటరీ, 13.2-అంగుళాల 4K LCD స్క్రీన్
-
Bandi Bhagirath Case: బండి భగీరథ్ కేసులో కొత్త ట్విస్ట్..
-
Green Moong Chaat Recipe: రొటీన్ బ్రేక్ ఫాస్ట్ బోర్ కొట్టిందా..? సింపుల్గా హై ప్రోటీన్ పెసరపప్పు చాట్ ట్రై చేయండి..
-
Mumbai Indians: ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త రికార్డు!
-
Vande Mataram in Madrasas: మదర్సాలలో వందేమాతరం తప్పనిసరి.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!