Chiranjeevi: ఎక్స్ పీరియంలో తొలి షూటింగ్ నాదే!
- చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్పీరియం పార్క్
- తాజాగా నేడు ప్రారంభించిన మెగాస్టార్ చిరంజీవి, సీఎం రేవంత్ రెడ్డి
- ప్రారంభోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కీలక ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిలుకూరులోని ప్రొద్దుటూరు వెస్ట్రన్ సెంటర్లో రామడుగు రాందేవ్ రావు ఎక్స్పీరియం పార్క్ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు, సీఎం రమేష్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రాందేవ్తో నా పరిచయం ఇప్పటిది కాదు. ఈ ఎక్స్పీరియం పార్కుని మీ అందరి కంటే ముందుగా నేను చూశా, 2000వ సంవత్సరంలోనే దీని గురించి రాందేవ్ నాతో పంచుకున్నారు. 2002 నుంచి నేను కూడా రాందేవ్ వద్ద నుంచి మొక్కల్ని తెప్పించుకుంటూనే ఉన్నా. మా ఇంట్లో ఉండే అనేక రకాల మొక్కలు, చెట్లు రాందేవ్ వద్ద నుంచి వచ్చినవే. రాందేవ్ ఓ వ్యాపారవేత్తగా ఎప్పుడూ ఆలోచించరు. పర్యావరణం, ప్రకృతి గురించి ఆలోచిస్తుంటారు. ఈ 150 ఎకరాలను వాణిజ్యంగానూ వాడుకోవచ్చు.

Chiranjeevi
Also Read
- Peddi: దత్తాత్రేయ స్వామి గుడిలో కూర్చుని పెద్ది కథ రాశా.. ‘పెద్ది’ సీక్రెట్స్ చెప్పిన బుచ్చిబాబు!
- Durandhar 2 Review: ఓటీటీలోకి 'ధురంధర్: ద రివెంజ్'.. ఎక్కడ? ఎప్పుడు? చూడాలంటే!
- Peddi : వేట షురూ.. 'రాంబుజ్జి'గా దివ్యేందు సంచలన ఎంట్రీ!
- Film Chamber Meeting : 'పెద్ది' సినిమాకు లైన్ క్లియర్: థియేటర్ల వివాదంపై తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం!
కానీ ఆయన ఈ 25 ఏళ్లుగా రకరకాల మొక్కల్ని, వివిద దేశాల నుంచి కొత్త జాతి మొక్కల్ని ఇక్కడకు తీసుకొచ్చి ఈ పార్క్ నిర్మించారు. ఈ రకంగా రాం దేవ్ ఓ మంచి ఆర్టిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ఎక్స్పీరియం పార్కుని చూసి నేను, రేవంత్ రెడ్డి షాక్ అయ్యాం. ఇంత అద్భుతంగా ఉన్న ఈ పార్కుని చూసి షూటింగ్కు ఇస్తారా? అని రాం దేవ్ను అడిగా, ఫస్ట్ షూటింగ్ చేసేది నా సినిమానే అయితే ఇస్తామన్నారు. కానీ ఈ ఎండలో నేను ఇక్కడ హీరోయిన్తో స్టెప్పులు వేయడం అంటే కాస్త కష్టమే. వర్షా కాలం తరువాత ఇక్కడ మరింత గ్రీనరీ వస్తుందని ఆ టైంలో షూటింగ్ చేస్తే అద్భుతంగా ఉంటుంది, వెడ్డింగ్, రిసెప్షన్, ఇతర కార్యక్రమాలకు ఈ చోటు అనువైనదిగా ఉంటుంది. దేశ విదేశాల్లో ఉండే ఎన్నో అరుదైన జాతి మొక్కల్ని ఒక చోటకు చేర్చి ఇంత అద్భుతమైన పార్కుని రాం దేవ్ నిర్మించారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి రావడం అభినందనీయం. ఆయన ఎంత బిజీగా ఉన్నా కూడా ఇలాంటి ప్రకృతి, పర్యావరణ సంరక్షణ కార్యక్రమాలకు రావడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.
తాజావార్తలు
-
Lift Accident : తెగిపడ్డ అపార్ట్మెంట్ లిఫ్ట్.. ఆరుగురు బీఆర్ఎస్ నాయకులకు గాయాలు.!
-
Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్తో రోజా ఇరుకున పడ్డారా?
-
Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
-
Story Board : ఫ్యూచర్ కోసం ఆర్థిక సూత్రం..? సంక్షోభం ముంచుకొచ్చాక ప్రభుత్వం మేల్కోందా ?
-
Hyderabad: గుడ్డిగా నమ్మితే ప్రాణాలు గాల్లో కలిసినట్టేనా? హైదరాబాద్ మర్డర్ నేర్పిస్తున్న పాఠమిదేనా?
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..