Alai balai: నేడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్ బలయ్.. ఒకే వేదికపై మెగాస్టార్, పవన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi- Alai balai: నిన్న మెగాస్టార్ చిరంజీవితో హర్యారా గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం గవర్నర్ దత్తాత్రేయ మాట్లాడుతూ.. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ఫాదర్ సినిమాపై దత్తాత్రేయ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి సినిమా గాడ్ఫాదర్ హిట్ కావడం సంతోషంగా ఉందన్నారు. నటుడిగా గొప్ప విలువలు వున్న వ్యక్తి చిరంజీవి అని గవర్నర్ ప్రశంసల జల్లు కురిపించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జరిగే అలయ్ బలయ్ కార్యక్రామానికి మెగాస్టార్ చిరంజీవిని కలిసిన బండారు దత్తాత్రేయ ప్రత్యేకంగా ఆహ్వానించామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే అలయ్ బలయ్ కార్యక్రమాన్ని దాదాపు 17 ఏళ్ల నుంచి నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. ఈవేడుకకు మెగాస్టార్ చిరంజీవి, జననేత పవన్ కళ్యాణ్ హాజరు కానున్నట్లు సమాచారం. దీంతో మెగా, పవన్ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. దీంతో భారీగా మోగా అభిమానులు నాంపల్లి ఎగ్జిబిషన్ ను చేరుకున్నారు. పది గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి సందడి వాతావరణం కనిపించింది. దీంతో పోలీసులు అధికారులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Also Read
- IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
- RD Burman Biopic: రాజేష్ ఖన్నాగా అక్షయ్, మెహమూద్గా ఇమ్రాన్… త్వరలోనే ఆర్డీ బర్మన్ బయోపిక్ షూటింగ్
- Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
- Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్లు !
Read also: Kerala: కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం.. విద్యార్థులతో సహా 9 మంది మృతి
ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం హాజరుకానున్నట్లు సమాచారం. ఇక.. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, భూపేంద్ర యాదవ్, జి. కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబా, హర్యానా, పంజాబ్ ముఖ్యమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, భగవత్ మాన్ సింగ్, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మెహమూద్ అలీ, మంత్రి శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తదితర ప్రముఖులు హాజరుకానున్నట్లు విశ్వనీయ సమాచారం.
అయితే.. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. కాగా.. ఈసారి మాత్రం దీనికి కాస్త రాజకీయ ప్రాధాన్యత ఏర్పడినట్టే కనిపిస్తోంది. ఇక… వచ్చే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతోండటం.. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టడం వంటి పరిస్థితుల మధ్య అలయ్ బలయ్ ఏర్పాటు కాబోతోండటం వల్ల అందరి దృష్టీ దాని మీదే ఉంది. ఇక.. హర్యారా గవర్నర్ బండారు దత్తాత్రేయ స్వయంగా చిరంజీవి కలిసి ప్రత్యేకంగా ఈకార్యాక్రమానికి ఆహ్వానించడంపై రాజకీయ కోణంలోనే చూడాల్సి వస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
Jio True 5G: 5జీలోనూ జియో సంచలనం.. అన్నీ ఫ్రీ… వారికి మాత్రమే..
తాజావార్తలు
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane: టీమిండియా టెస్ట్ టీమ్ కోసం మేం ముగ్గురం ఎంతో కష్టపడ్డాం!
-
Ethanol in Diesel: డీజిల్లో ఇథనాల్కు బ్రేక్.. వెనక్కి తగ్గిన కేంద్రం.. అసలు కారణం ఇదే..!
-
IRUMUDI : ఇరుముడి కథ, కథనం ఏంటో చెప్పేసిన దర్శకుడు శివ నిర్వాణ
-
ODI World Cup 2027: ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని ఏలిన టీమ్.. ఇప్పుడు వరల్డ్కప్ బెర్త్ కోసం పాకులాట!
ట్రెండింగ్
-
64MP కెమెరా, 9.49 మి.మీ. మందం, AI కెమెరా ఫీచర్లతో ఆగస్టు 25న రానున్న Boltt Ace 5G..!
-
7,000mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, FHD+ LCD 120Hz డిస్ప్లేతో వచ్చేందుకు సిద్దమైన Moto G Max..!
-
రూ.8,499కే Lava Smart 4 లాంచ్.. మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 5000mAh బ్యాటరీ, 90Hz LCD డిస్ప్లేతో బడ్జెట్ ఫోన్..!
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!