Paris Olympics 2024: పారిస్ లో మెగా ఫ్యామిలీ సందడి..సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్..

  • ఈ ఏడాది పారిస్‌లో ఒలింపిక్స్
  • ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలకు హాజరైన మెగా ఫ్యామిలీ
  • సోషల్ మీడియాలో ఫొటోలు..వీడియోలు వైరల్
Mega Family

Mega Family

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా కార్యక్రమాల్లో ఒకటైన ఒలింపిక్స్‌ను ఈ ఏడాది పారిస్‌లో నిర్వహిస్తున్నారు. జులై 26 నుంచి ఒలింపిక్స్‌ ప్రారంభమయ్యాయి. దేశంలోని 117 మంది క్రీడాకారులు పాల్గొంటున్నందున భారతీయులు కూడా ఈ గేమ్‌ను ఆసక్తిగా చూస్తు్న్నారు. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆటగాళ్లకు శుభాకాంక్షలు తెలిపారు. అదే సమయంలో ఒలింపిక్స్ ప్రారంభ కార్యక్రమానికి మెగాస్టార్ ఫ్యామిలీ ప్యారిస్ చేరుకుంది.

READ MORE: US: ఒరెగాన్ ఫారెస్ట్‌లో కూలిన ట్యాంకర్ విమానం.. పైలట్ మృతి

మెగాస్టార్ చిరంజీవి తో పాటు.. ఆయన భార్య సురేఖ కొణిదెల, కుమారుడు రామ్ చరణ్, కోడలు ఉపాసన, మనవరాలు క్లీన్ కారాతో కలిసి ఒలింపిక్స్‌ను వీక్షించారు. కొణిదెల ఫ్యామిలీకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్ఆర్ఆర్ నటుడు రామ్ చరణ్ భార్య ఉపాసన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పారిస్ ఒలింపిక్స్ కి సంబంధించిన ఫొటోలు పంచుకున్నారు. చిత్రంలో.. నటుడు నల్ల టీ-షర్ట్, జాకెట్, టోపీ మరియు అద్దాలు ధరించి ఆటను ఆస్వాదిస్తున్నాడు. అలాగే ఉపాసన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ఆమె అత్తమామలు (సురేఖ, చిరంజీవి) ప్యారిస్ వీధుల్లో షికారు చేస్తున్నట్లు చూడొచ్చు.

READ MORE: Hydrogen Motocycle: పెట్రోల్ అవసరం లేదు.. ప్రపంచంలో తొలి హైడ్రోజన్ బైక్..

వర్షంలోనూ వీక్షణ..
కొణిదెల కుటుంబాన్ని ఒలింపిక్స్ వేడుకలను వీక్షించకుండా వర్షం కూడా ఆపలేకపోయింది. ఉపాసన తన భర్త మరియు అత్తమామలతో అనేక చిత్రాలను పంచుకుంది. అందులో ఆమె దుస్తులు వర్షంలో తడిసి ఉండటం కనిపించింది.