Site icon NTV Telugu

Manasa Varanasi : అలాంటి కథల కోసమే చూస్తున్నా!

Manasa

Manasa

మిస్ ఇండియాగా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న మానస వారణాసి తాజాగా హైదరాబాద్‌లో సందడి చేశారు. ఇటీవలే ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఆమె, తాజాగా ఒక ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ నూతన శాఖను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని ఆర్‌సీ పురంలో ‘అనుటెక్స్’ నూతన బ్రాంచ్‌ను మానస వారణాసి చేతుల మీదుగా వైభవంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “అనుటెక్స్ అనేది నా చిన్నప్పటి నుంచి వింటున్న పేరు. 1970వ దశకం నుండి నాణ్యమైన వస్త్రాలకు చిరునామాగా నిలిచిన ఈ సంస్థ స్టోర్‌ను ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. ఇక తన సినీ కెరీర్‌పై కూడా మానస ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇటీవలి చిత్రం ‘కపుల్ ఫ్రెండ్లీ’ సాధించిన విజయం తనలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆమె తెలిపారు. ప్రస్తుతానికి మంచి ప్రాధాన్యత ఉన్న కథల కోసం చూస్తున్నానని, ఇప్పటికే కొన్ని కథలు విన్నానని ఆమె వెల్లడించారు. త్వరలోనే తన తదుపరి ప్రాజెక్టులకు సంబంధించిన అప్‌డేట్స్ వెల్లడిస్తానని అభిమానులకు క్లారిటీ ఇచ్చారు.

Exit mobile version