M4M Movie: మే 8న థియేటర్లలోకి ‘ఎం4ఎం’.. పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్పై భారీ అంచనాలు!
- మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఎం4ఎం
- సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఎం4ఎం
- పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్పై భారీ అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో రూపొందిన ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లింగ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో అమెరికన్ నటి జో శర్మ, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్పై, మెక్విన్ గ్రూప్ యూఎస్ఏ సహకారంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
భారతదేశంలో ఎం4ఎం చిత్రాన్ని పీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్ విడుదల చేయనుండగా.. అమెరికాలో టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్, ఉత్తర భారతంలో జేవీఈఎల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు విడుదల బాధ్యతలు చేపట్టాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్కు సన్నాహాలు పూర్తయ్యాయి. థియేటర్లలోకి రాకముందే ఎం4ఎం చిత్రం అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందింది. ప్రముఖ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పాలైస్ సి థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన జరగగా.. ముంబైలోని ఇంపా ప్రివ్యూ థియేటర్లో కూడా స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ ప్రదర్శనలకు సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన లభించింది.
Also Read
- Jackky Bhagnani: హీరోయిన్ రకుల్తో పెళ్లై ఏడాది కూడా కాకముందే డేటింగ్ యాప్లో జాకీ భగ్నానీ? వైరల్ అవుతున్న లీక్స్!
- Munna Bhaiya: ‘మున్నాభయ్య’ ఈజ్ బ్యాక్.. దివ్యేందు శర్మ నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!
- Bhagyashri Borse: హిట్లతో పనిలేదు.. టాలీవుడ్ను దాటేసి భాగ్యశ్రీ బోర్సే పాన్ ఇండియా హంగామా!
- Anantha Sriram: ‘కల్కి’ డైరెక్టర్ నాగ్ అశ్విన్ టార్గెట్గా అనంత శ్రీరామ్ కామెంట్స్? కర్ణుడు - అర్జునుడి పాత్రలను అలా చూపిస్తారా!
హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్లో నిర్వహించిన ప్రమోషన్ టూర్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది. సినిమా విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. మే 8న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నామని తెలిపారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడటం గర్వకారణమని, ప్రీమియర్ షోలకు అద్భుత స్పందన వచ్చిందని చెప్పారు. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!