M4M Movie: మే 8న థియేటర్లలోకి ‘ఎం4ఎం’.. పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్పై భారీ అంచనాలు!
- మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఎం4ఎం
- సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఎం4ఎం
- పాన్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్పై భారీ అంచనాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉత్కంఠభరిత హత్యా కథాంశంతో రూపొందిన ‘ఎం4ఎం’ చిత్రం మే 8న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. థ్రిల్లింగ్ స్టోరీతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో అమెరికన్ నటి జో శర్మ, సాంబీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటించారు. దర్శకుడు మోహన్ వడ్లపట్ల స్వీయ నిర్మాణంలో మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్పై, మెక్విన్ గ్రూప్ యూఎస్ఏ సహకారంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది.
భారతదేశంలో ఎం4ఎం చిత్రాన్ని పీవీఆర్ ఇనాక్స్ పిక్చర్స్ విడుదల చేయనుండగా.. అమెరికాలో టెక్ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్, ఉత్తర భారతంలో జేవీఈఎల్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు విడుదల బాధ్యతలు చేపట్టాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్కు సన్నాహాలు పూర్తయ్యాయి. థియేటర్లలోకి రాకముందే ఎం4ఎం చిత్రం అంతర్జాతీయ వేదికలపై గుర్తింపు పొందింది. ప్రముఖ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్భంగా పాలైస్ సి థియేటర్లో ప్రత్యేక ప్రదర్శన జరగగా.. ముంబైలోని ఇంపా ప్రివ్యూ థియేటర్లో కూడా స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ ప్రదర్శనలకు సినీ ప్రముఖుల నుంచి మంచి స్పందన లభించింది.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
హీరోయిన్ జో శర్మా అమెరికా, భారత్లో నిర్వహించిన ప్రమోషన్ టూర్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకువచ్చింది. సినిమా విడుదలకు ముందే మంచి హైప్ ఏర్పడటంతో ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దర్శకుడు మోహన్ వడ్లపట్ల మాట్లాడుతూ.. మే 8న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదల చేయబోతున్నామని తెలిపారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడటం గర్వకారణమని, ప్రీమియర్ షోలకు అద్భుత స్పందన వచ్చిందని చెప్పారు. థ్రిల్లింగ్ కథనం, సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని నమ్మకం వ్యక్తం చేశారు.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!