దేశంలో సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో జనజీవనం సాధారణ పరిస్థితికి వచ్చినట్టుగా తిరిగేస్తున్నారు. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సెకండ్ వేవ్ పరిస్థితులపై మరోసారి స్పందించింది. కరోనా నుంచి కోలుకోవడంతో అప్పుడే మనం సాధారణ జీవితానికి వచ్చినట్టు కాదని, దానికి ఇంకా సమయం పడుతుందని తెలిపింది. వ్యాధి నుంచి బయటపడిన వెంటనే అంతా బాగుంటుందని అనుకోవటం పొరపాటని కత్రినా అభిప్రాయపడింది. చాలా వరకు అలసట, శరీరంలో చాలా మార్పులు చేసుకుంటాయని తెలిపింది. దీనికి యోగాతో పాటుగా, వ్యాయామం ఒక్కటే మార్గం అని తెలిపింది. మానసిక ధైర్యం ఉంటే కరోనా నుంచి బయటపడొచ్చని కత్రినా చెప్పుకొచ్చింది.