Jayam Ravi: బ్రేకప్ చెప్పేసిన కెనీషా ఫ్రాన్సిస్? జయం రవికి భారీ షాక్, చెన్నై వదిలేసి?

Kenishaa Francis

Kenishaa Francis

తమిళ నటుడు జయం రవి, ఆయన భార్య ఆర్తి రవి విడాకుల వ్యవహారం అప్పట్లో తమిళ సినీ పరిశ్రమలో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఆ సమయంలో రవి-కెనీషా ఫ్రాన్సిస్ ఎఫైర్ వార్తలు కూడా గుప్పుమన్నాయి. మొదట్లో ఈ వార్తలను కొట్టిపారేసిన ఈ జంట ఆ తర్వాత కెనీషాతో రవి సన్నిహితంగా మెలిగారు. 2026 ఉత్సవ్‌లో భాగంగా మీన్‌కుళత్తి భగవతి ఆలయంలో ఆమె పాడగా.. రవి కూడా వేదికపై సందడి చేశాడు. అయితే ఆ తర్వాత ఆర్తి రవిని కించపరిచేలా కెనీషా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆర్తి సన్నిహితురాలు, నటి కుష్బూ పరోక్షంగా కౌంటర్ ఇవ్వగా.. ఆర్తి ఆ పోస్ట్‌కు లైక్ కొట్టడం మరింత వివాదానికి దారితీసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో కెనీషా ఫ్రాన్సిస్ సంచలన నిర్ణయం తీసుకుంది. జయం రవితో బ్రేకప్ చేసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించి, చెన్నై వీడుతున్నట్లు తెలిపింది. తాను ప్రేమతో ఈ బంధంలోకి వచ్చానని, ఇప్పుడు మౌనంగా వైదొలుగుతున్నానని పేర్కొంది. ఒక మంచి వ్యక్తిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో తనను తాను ఎంతో నష్టపోయాకని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ప్రపంచంలో దయకు చోటు లేదని, అందరూ గందరగోళాన్నే ఇష్టపడుతున్నారని వాపోయింది. “సినిమా ఇండస్ట్రీ, జనం, రవిని ప్రేమించేవాళ్లు, ద్వేషించేవాళ్లు, విమర్శించేవాళ్లు… ఇకపై ఆయన మీవాడు. నా నుంచి ఎలాంటి వివరణలు ఉండవు. నేను ఇక పోరాడలేను. మంచివాళ్లకు మద్దతుగా ఉండాలనే నా ఆలోచన తప్పని అర్థమైంది. ఈ ప్రపంచం అబద్ధాలు, మోసాలు, కుట్రలతో నిండిపోయింది” అని కెనీషా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది.

రవిని ప్రేమతో వదిలేస్తున్నానని, ఇకపై ఈ బంధం తన బాధ్యత కాదని తేల్చి చెప్పింది. నిజమైన ప్రేమ, విధేయతను ప్రపంచానికి చూపించాలనుకున్నా, ఎవరూ నమ్మడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. చెన్నైని వదిలివెళ్తున్నానని, సంగీతం, థెరపీ అన్నీ వదిలేశానని ప్రకటించింది. తన సోషల్ మీడియా ఖాతాలను సైతం డీయాక్టివేట్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ పరిణామంతో కెనీషా, రవి విడిపోయారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి అయితే దీనిపై జయం రవి ఇంతవరకు స్పందించలేదు. చూడాలి మరి ఏమవుతుంది అనేది.