NTV Telugu Site icon

Jai Hanuman : చేతులు మారిన ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్’..?

Jai Hanuman

Jai Hanuman

క్రియేటివ్ జీనియస్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా లీడ్ రోల్ లోవచ్చిన హనుమాన్ సూపర్ హిట్ గా నిలిచింది.సంక్రాంతి కానుకగా వచ్చి వందకోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా జై హనుమాన్ ను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ఇప్పటికే సిక్వెల్ లో కీలకమైన హనుమాన్ పాత్రకు కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ని తీసుకున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. దీనిపై అధికారకంగా ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : Amaran : ఆ హీరోయిన్ ‘అన్న’ అంది.. ఎంతో బాధపడ్డాను! స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇదిలా ఉండగా ఈ సీక్వెల్ యూజ్ సంబంధించి ఓ న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో డిస్కషన్స్ కు దారితీసింది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం జై హనుమన్ ప్రాజెక్ట్ చేతులు మారినట్టు తెలుస్తోంది. వాస్తవానికి హనుమాన్ ను నిర్మించింది ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ నిరంజన్ రెడ్డి. ఇప్పుడు రాబోయే జై హనుమాన్ కూడా అదే బ్యానర్ లోనే చేయాలి. తమ బ్యానర్ లోనే నిర్మిస్తామని కూడా ప్రైమ్ షో నిర్మాతలు ప్రకటించారు కూడా. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ప్రైమ్ షో నుండి బడా మేకర్స్ వద్దకు వచ్చి చేరిందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ కోసం దర్శకుడు అడిగిన రెమ్యునరేషన్ ను ఇచ్చేందుకు సుముఖంగా లేరని, అలాగే లాభాలలోవాటా అంటే గిట్టుబాటు కాదని అందుకు కారణంగా ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ చేతిలోకి వెళ్ళింది అన్న టాలీవుడ్ లో ఒకటే గుస గుస వినిపిస్తుంది. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానున్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిని కూడా మార్చే ఆలోచనలో ఉన్నారు అని టాక్