Sarabjit: కంగనా సినిమా ‘ఎమర్జెన్సీ’ ని నిషేధించాలి.. లేదంటే..! ఇందిరా గాంధీ హంతకుడి కొడుకు హెచ్చరిక
- 'ఎమర్జెన్సీ' సినిమా ను నిషేధించాలన్న ఇందిరా గాంధీ హంతకుడి కుమారుడు
- లేదంటే శాంతి భద్రతలకు ముప్పని హెచ్చరిక
- సరబ్జిత్ సింగ్ ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కంగనా రనౌత్ తన ‘ఎమర్జెన్సీ’ సినిమా విషయంలో వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై ఫరీద్కోట్ స్వతంత్ర ఎంపీ సరబ్జిత్ సింగ్ ఖల్సా అభ్యంతరం వ్యక్తం చేశారు. సరబ్జిత్ సింగ్ ఫేస్బుక్లో సుదీర్ఘమైన పోస్ట్ రాశారు. అందులో ‘ఎమర్జెన్సీ’ చిత్రం సిక్కు సమాజాన్ని తప్పుగా చూపుతుందని.. దాని వల్ల శాంతి భద్రతలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
READ MORE: Tesla Job Offer: బంపర్ ఆఫర్.. 7గంటల పనికి రూ.28,000!..అర్హతలివే..
Also Read
సరబ్జిత్ ఫేస్బుక్లో పోస్ట్..
సరబ్జిత్ సింగ్ ఖల్సా ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ చేశారు. అందులో ఇలా వ్రాశారు.. ‘కొత్త చిత్రం ఎమర్జెన్సీలో సిక్కులను తప్పుగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చాయి. దీనివల్ల సమాజంలో శాంతిభద్రతలకు ముప్పు కలగవచ్చనే భయం నెలకొంటోంది. ఈ సినిమాలో సిక్కులను వేర్పాటు వాదులుగా, ఉగ్రవాదులుగా చూపించారంటే అది భారీ కుట్రగా భావిస్తున్నాం. ఈ చిత్రం ఇతర దేశాలలో సిక్కులపై ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి కారణమవ్వొచ్చు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించి ఆపాలి. దేశంలో సిక్కులపై విద్వేషపూరిత దాడుల వార్తలు తరచుగా తెరపైకి వస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ చిత్రం సిక్కు సమాజంపై ద్వేషాన్ని కూడా రెచ్చగొట్టేలా ఉంటుంది. సిక్కు సమాజం ఈ దేశం కోసం గొప్ప త్యాగాలు చేసింది. వాటిని పూర్తిగా సినిమాల్లో చూపించలేదు.” అని పేర్కొన్నారు.
READ MORE:YS Jagan: మాజీ సీఎం జగన్కు రాఖీలు కట్టేందుకు పోటీపడిన మహిళలు
సరబ్జిత్ ఫేస్బుక్లో.. “సిక్కుల పరువు తీసే ప్రతి ప్రయత్నం జరుగుతోంది. సమాజ సామరస్యం, చట్టపరమైన క్రమంలో, అభ్యంతరకరమైన సినిమాలు, పాటలను నిషేధించాలి. సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం నేను ఎప్పుడూ కృషి చేస్తాను. ఇలాంటి సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా నా గర్జిస్తాను. వాటిని ఆపడానికి ప్రయత్నిస్తాను.” అని రాసుకొచ్చారు.
READ MORE:Top Headlines @5PM : టాప్ న్యూస్
సరబ్జిత్ సింగ్ ఖల్సా ఎవరు?
సరబ్జిత్ సింగ్ ఖల్సా బియాంత్ సింగ్ కుమారుడు. 1984 అక్టోబర్ 31న ఆపరేషన్ బ్లూ స్టార్ కింద అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని కాల్చి చంపిన ఇద్దరు అంగరక్షకుల్లో బియాంత్ సింగ్ ఒకరు. ఇప్పుడు కంగనా రనౌత్ తన ‘ఎమర్జెన్సీ’ సినిమాతో తెరపైకి వస్తోంది. ఇందులో 1975లో ఇందిరాగాంధీ భారతదేశంలో విధించిన ఎమర్జెన్సీ కాలం, ఇందిర పోరాటం, ఆమె హత్య కథను చూపించనున్నారు. ఇందిరా గాంధీ పాత్రలో కంగనా నటిస్తోంది. అనుపమ్ ఖేర్, శ్రేయాస్ తల్పాడే, మహిమా చౌదరి, మిలింద్ సోమన్, విశాక్ నాయర్ వంటి తారలు ఆయనతో ఈ చిత్రంలో పనిచేశారు.
తాజావార్తలు
-
2027 ODI World Cup: సెలెక్టర్లకు మైండ్ పని చేయడం లేదా?.. బీసీసీఐపై మాజీ టీమిండియా స్టార్ ఫైర్!
-
Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
-
Theft: రెచ్చిపోయిన దొంగలు.. 10 నిమిషాల్లో రూ.50 లక్షల విలువైన 77 మొబైల్ ఫోన్లు చోరీ..
-
Bethlehem Kudumba Unit: ‘ప్రేమలు’ డైరెక్టర్ నుంచి మరో రొమాంటిక్ మ్యాజిక్.. రిలీజ్ డేట్ అనౌన్స్
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు జాగ్రత్త సుమీ!
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!