Tollywood Focus: హీరోలకంటే డైరెక్టర్లకే క్రేజ్ ఎక్కువ.. కానీ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరో పోస్టర్ మీద కనిపిస్తే చాలు థియేటర్లు కళకళలాడేవి. కానీ, కాలం మారింది. ఇప్పుడు ప్రేక్షకుడు కేవలం హీరోను మాత్రమే కాదు, ఆ సినిమా వెనుక ఉన్న దర్శకుడి ‘ట్రాక్ రికార్డ్’ను కూడా అంతే బలంగా నమ్ముతున్నాడు. దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావుల కాలం నాటి దర్శకుడి బ్రాండ్ ఇమేజ్ను నేటితరం దిగ్గజాలు సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లారు.
దర్శకుడి బ్రాండ్ వాల్యూ గురించి మాట్లాడితే అందరికంటే ముందు గుర్తొచ్చే పేరు ఎస్.ఎస్. రాజమౌళి. కెరీర్లో ఒక్క ఫ్లాప్ కూడా లేని ఆయన, బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలతో హీరోల మార్కెట్ పరిధిని గ్లోబల్ స్థాయికి పెంచారు. ఇప్పుడు మహేష్ బాబుతో రాబోతున్న తదుపరి ప్రాజెక్ట్ పై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు పెరగడానికి కారణం ‘రాజమౌళి విజన్’ అనే నమ్మకమే. మరోవైపు సుకుమార్, తన క్లిష్టమైన స్క్రీన్ ప్లే మరియు విభిన్నమైన క్యారెక్టరైజేషన్లతో టాలీవుడ్లో బలమైన ముద్ర వేశారు. రంగస్థలంలో రామ్ చరణ్, పుష్పలో అల్లు అర్జున్ను సరికొత్తగా చూపించి బాక్సాఫీస్ను షేక్ చేశారు. ఇక ‘అర్జున్ రెడ్డి’, ‘అనిమల్’ చిత్రాలతో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా.. ప్రస్తుతం ప్రభాస్తో తీయబోయే ‘స్పిరిట్’ సినిమాతో దర్శకుడే ఒక పెద్ద బ్రాండ్ అని నిరూపిస్తున్నారు.
Also Read
- Prabhas Sreenu: "ఆ వార్తలు చదివి చాలా బాధపడ్డా".. సినియర్ యాక్టర్తో రూమర్స్పై ప్రభాస్ శ్రీను రియాక్షన్
- Prabhas: "నా జీవితంలో ప్రభాస్ దేవుడిలాంటి వ్యక్తి"
- Prabhas Sreenu: "ప్రభాస్ దగ్గర డబ్బు అడగాల్సిన అవసరమే రాదు.. ఎందుకంటే!"
- Prabhas Srinu: "అర్ధరాత్రి అడవిలో నాటుకోడి కోసం వేట.. ప్రభాస్ కోసం చేసిన పని చెప్పిన ప్రభాస్ శ్రీను!"
‘కల్కి 2898 ఏడీ’తో ఇండియన్ సినిమాకు గ్లోబల్ సైన్స్ ఫిక్షన్ వరల్డ్ పరిచయం చేసిన నాగశ్విన్, భారీ స్టార్ కాస్ట్ ఉన్నప్పటికీ తన మేకింగ్ స్టైల్తోనే ఆడియన్స్ను కట్టిపడేశారు. అలాగే కేజీఎఫ్, సలార్ చిత్రాలతో ప్రశాంత్ నీల్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్గా ఎదిగారు. కోలీవుడ్ నుంచి అట్లీ, లోకేష్ కనకరాజ్ లాంటి యువ దర్శకులు స్టార్ హీరోల ఇమేజ్ను వాడుకుంటూనే తమకంటూ ప్రత్యేక సినిమాటిక్ యూనివర్స్ను క్రియేట్ చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ను శాసించిన శంకర్ లాంటి సీనియర్లు ప్రస్తుతం తమ పాత మ్యాజిక్ను నిరూపించుకోవాల్సిన పోటీ వాతావరణం నెలకొంది.
ఇటు సౌత్తో పాటు బాలీవుడ్లోనూ రాజ్ కుమార్ హిరాణీ, సంజయ్ లీలా భన్సాలీ, ఆదిత్య చోప్రా, అయాన్ ముఖర్జీలతో పాటు ‘ఉరి’ ఫేమ్ ఆదిత్య ధర్ లాంటి దర్శకులు హీరోలతో సమానంగా ఓపెనింగ్స్ రాబడుతున్నారు. భన్సాలీ నిర్మిస్తున్న ‘లవ్ అండ్ వార్’ చిత్రం కోసం రణబీర్, అలియా, విక్కీ కౌశల్ లాంటి స్టార్లు ఒకే ఫ్రేమ్లోకి రావడం ఆయన బ్రాండ్ పవర్కు నిదర్శనం. హీరో ప్రేక్షకుడిని థియేటర్ వరకు తీసుకురాగలడేమో కానీ, సీట్లో కూర్చోబెట్టి మెప్పించేది మాత్రం దర్శకుడి కథ, కధనాలే. నేటి సినీ పరిశ్రమలో కేవలం హీరోనో, దర్శకుడో మాత్రమే కాదు.. వీరిద్దరి క్రేజీ కాంబినేషన్కు బలమైన స్క్రీన్ ప్లే తోడైనప్పుడే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలవుతుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : విద్యాసంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలదే బాధ్యత
-
KMM CYBER CASE: లెక్క తేలుస్తారా..?
-
Gun Fire: ఆస్తి కోసం దారుణం.. సొంత వదినపైనే సుపారీ గ్యాంగ్తో కాల్పులు..
-
OTR: ‘నేను ఎమ్మెల్యేన్రా.. నన్ను గుర్తించండ్రా’..
-
Trump-Zelensky: మరోసారి వైట్హౌస్కు జెలెన్స్కీ.. ట్రంప్తో ఎందుకింత ఎమర్జెన్సీ మీటింగ్ అంటే..!
ట్రెండింగ్
-
Rainy Season Kitchen Tips : వర్షాల్లో బియ్యానికి పురుగులా? ఇలా చేస్తే సమస్యే లేదు.!
-
కేవలం రూ. 8,999 లకే120Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో Lava Virat V1 5G, Virat V1 స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
రూ. 19,499లకే 50MP సోనీ కెమెరా, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో iQOO Z11 Lite 5G లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సక్సెస్ను తలకెక్కించుకోను.. బుద్దిగా ఉంటా.. వైభవ్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Kakarakaya Ulli Karam: చేదు లేకుండా కమ్మటి ‘కాకరకాయ ఉల్లి కారం’.. ఇలా చేస్తే పిల్లలు కూడా వదలకుండా తింటారు!