“గల్లీ రౌడీ”కి సెన్సార్ పూర్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ మూవీ “గల్లీ రౌడీ”. థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ ను జారీ చేసింది. దీంతో సినిమా ఆగష్టులో విడుదలకు సిద్ధమైంది. ఇంకా మేకర్స్ “గల్లీ రౌడీ” రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ ను ప్రకటించి ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించనున్నారు.
Read Also : చిరు ‘లూసిఫర్’ సెట్స్ పైకి వెళ్ళేది ఎప్పుడంటే…
Also Read
జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’ తెరకెక్కుతోంది. బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై ఎంవివి సత్యనారాయణ, కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. సాయి కార్తీక్, రామ్ మిరియాలా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇప్పటికే ‘గల్లీ రౌడీ’ నుంచి విడుదలైన టీజర్, సాంగ్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై ఆసక్తి కూడా పెరిగింది. ఈ సినిమాతో సందీప్ కిషన్ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
- Tags
తాజావార్తలు
-
Petrol-Diesel Prices: వాహనదారులకు తగలనున్న షాక్.. పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు!
-
YS Jagan: హలో ఇండియా అంటూ వైఎస్ జగన్ ఆసక్తికర ట్వీట్..
-
Crispy Ragi Murukku: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. టీతో ఈ రాగి మురుకులు తింటే ఆ మజానే వేరు!
-
CM Chandrababu: శాంతిభద్రతలపై సీఎం కీలక సమీక్ష.. సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేయాలని ఆదేశాలు
-
Ragi Halwa: రాగి పిండితో నోరూరించే స్వీట్ హల్వా.. వంట రాని వారు కూడా ఈజీగా చేసేయొచ్చు!