రాజ్ కుంద్రా యాప్స్ యాపారం! 3 లక్షలు ముంచేశాడంటోన్న గుజరాత్ వ్యాపారి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజ్ కుంద్రా మెడకు ఒక్కో కేసు మెల్లమెల్లగా చుట్టుకుంటోంది. మొదట పోర్న్ వీడియోలు డిస్ట్రిబ్యూట్ చేశాడన్నారు పోలీసులు. తరువాత న్యూడ్ సెన్సేషన్ పూనమ్ పాండే ఆరోపణలు మొదలు పెట్టింది. తనని కూడా రాజ్ కుంద్రా కంపెనీ వారు మోసం చేశారని ఆమె అంటోంది. ఇక ఇప్పుడు అహ్మదాబాద్ నుంచీ మరో కేసు కుంద్రా నెత్తిన పడింది.
Read Also : ఆహాలో సమంత ‘సూపర్ డీలక్స్’
Also Read
గుజరాత్ లోని అహ్మదాబాద్ కు చెందిన హిరేన్ పర్మర్ స్వంత రాష్ట్రంలోని సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ తో పాటూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు కూడా రాజ్ కుంద్రా పై కంప్లైంట్ ఇచ్చాడు. ఆయన ఆరోపిస్తున్న దాని ప్రకారం శిల్పా శెట్టి భర్త ఆధీనంలోని ‘వియాన్ ఇండస్ట్రీస్’ అతడ్ని మోసం చేసిందట. 3 లక్షలు తీసుకుని ఓ ఆన్ లైన్ గేమ్ విషయంలో డిస్ట్రిబ్యూటర్ గా చేర్చుకుంటామన్నారట! కానీ, అలాంటిదేం జరగలేదు! ‘గేమ్ ఆఫ్ డాట్’ పేరుతో తనకు 3 లక్షలు ఎగొట్టి ఆటలో అరటి పండుని చేశారని హిరేన్ గ్రహించాడు. కానీ, తరువాత సైబర్ క్రైమ్ పోలీసుల్ని ఆశ్రయించినా లాభం లేకపోయింది. తాజాగా రాజ్ కుంద్రా అరెస్ట్ తో గుజరాత్ వ్యాపారి హిరేన్ పర్మర్ కూడా బయటకొచ్చాడు. మరోసారి తన డబ్బు తనకు ఇప్పించమని ముంబై పోలీసుల్ని సైతం కంప్లైంట్ లో రిక్వెస్ట్ చేశాడు.
2019లో తనకు జరిగిన మోసానికి ఇప్పుడు న్యాయం కోరుతోన్న గుజరాత్ వ్యాపారి హిరేన్, బాధితులు ఇంకా చాలా మంది ఉన్నారని, చెబుతున్నాడు. రానున్న రోజుల్లో రాజ్ కుంద్రా బాధితులు అంతకంతకూ ఎక్కువయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. కేసులు ఎంతగా పెరిగితే శిల్పా శెట్టికి అంత తలనొప్పి అని చెప్పక తప్పదు…
తాజావార్తలు
-
RK Roja: అసెంబ్లీలోనే బలనిరూపణ జరగాలి.. గవర్నర్ ముందే ఎందుకు? రోజా ఫైర్
-
Rohit Sharma Lady Fan: అభిమాని కోసం వెయిట్ చేసిన రోహిత్ శర్మ.. తబ్బిబైపోయిన యువతి, వీడియో వైరల్!!
-
Irumudi: రవితేజ ‘ఇరుముడి’ షూటింగ్ అప్డేట్..
-
Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటులో జాప్యం.. విజయ్ అభిమానుల్లో తీవ్ర ఆవేదన.. ఆత్మహత్యాయత్నం కలకలం
-
Mamata Banerjee: ‘మాజీ’ అని పెట్టుకోను.. మమతా బెనర్జీ ‘X’ బయోలో తెలివైన మార్పు!