కత్తి మహేష్ మృతిపై ఎంక్వయిరీ… పోలీసులకు ఏపీ గవర్నమెంట్ ఆదేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిత్ర విమర్శకుడు కత్తి మహేష్ మరణం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఈ విషయంపై ఏపీ పోలీసులు ఇప్పటికే విచారణ ప్రారంభించారు. వివరాల్లోకి వెళ్తే… కత్తి మహేష్ రెండు వారాల క్రితం ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన కత్తిని చెన్నైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన చికిత్స పొందుతూ కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… కత్తి మహేష్కు తీవ్ర గాయాలు అయినప్పటికీ, అతని డ్రైవర్కు పెద్దగా గాయాలు కాలేదు. దీంతో దళిత నాయకుడు మంద కృష్ణ కూడా ఈ సందేహాలను లేవనెత్తుతూ మహేష్ మరణం వెనుక కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై జోక్యం చేసుకోవాలని ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. అంతేకాకుండా సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తి ద్వారా విచారణ కూడా చేయాలని డిమాండ్ చేశారు.
Read Also : కోల్ కత్తాకు చేరుకున్న తలైవా !
Also Read
- Rao Bahadur Teaser: ఈసారి సత్యదేవ్ కొట్టేలా ఉన్నాడు.. ‘రావు బహదూర్’ టీజర్ డేట్ ఫిక్స్.. రిలీజ్ డేట్ అప్పుడే!
- Nithya Menen: మెగాఫోన్ పట్టనున్న నిత్యా మీనన్?
- NBK-Vivek Athreya: బాలకృష్ణ బర్త్ డే వేడుకల్లో వివేక్ ఆత్రేయ - మైత్రీ రవిశంకర్.. వైరల్ ఫోటో వెనుక అసలు కథ ఇదేనా!
- Pawan Kalyan: 'పవన్ కళ్యాణ్' నా పేరు కాదు.. అసలు పేరు చెప్పి షాకిచ్చిన పీకే!
మంద కృష్ణతో పాటు, కత్తి మహేష్ తండ్రి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. మహేష్ మరణం గురించి ఆసుపత్రి ముందుగా తమకు తెలియాలని, కానీ వారు అలా చేయకుండా నేరుగా వార్తలను మీడియాకు విడుదల చేశారని అన్నారు. కాగా మంద కృష్ణ చేసిన అభ్యర్థనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించి ఈ విషయంపై పోలీసు విచారణకు ఆదేశించింది. ప్రమాదం ఎలా జరిగింది?, కత్తి మహేష్కు మాత్రమే ఎందుకు తీవ్ర గాయాలు అయ్యాయి? అని ఆంధ్రప్రదేశ్ పోలీసులు డ్రైవర్ను ప్రశ్నించారు. విచారణలో డ్రైవర్ తాను సీట్బెల్ట్ ధరించానని, కత్తి మహేష్ మాత్రం సీట్ బెల్ట్ ధరించలేదని వెల్లడించినట్టు తెలిసింది. మరి రానురాను ఈ సమస్య ఏ మలుపు తీసుకుంటుందో అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Story Board: హైదరాబాద్లో చినుకు పడితే చిత్తడేనా..? వర్షాకాలం అంతా బిక్కుబిక్కుమనాల్సిందేనా?
-
RBI: క్రెడిట్ రిస్క్ నిబంధనల్లో కీలక మార్పులు.. ఆర్బీఐ ముసాయిదా విడుదల
-
Off The Record: BRSలో భారీ ప్రక్షాళన ఉండబోతుందా? కాస్త తేడాగా ఉన్న నాయకులకు ఫైనల్ వార్నింగ్?
-
Trump-Iran: ఈరోజే భారీగా విరుచుకుపడతాం.. ఇరాన్కు ట్రంప్ తాజా హెచ్చరిక
-
Whats App: వాట్సాప్లో అద్బుత ఫీచర్.. ఫార్వార్డెడ్ మెసేజ్ మొదట ఎక్కడ నుంచి వచ్చిందో కనిపెట్టడం చాలా ఈజీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!