తన కెరీర్ లో ఒకే ఒక సారి ద్విపాత్రాభినయం చేశాడు యాక్షన్ హీరో గోపీచంద్. ‘గౌతమ్ నందా’ పేరుతో రూపొందిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి గోపీచంద్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. ఆ సినిమాయే తేజ దర్శకత్వంలో రూపొందనున్న ‘అలిమేలుమంగ వేంకటరమణ’. ఈ సినిమాలో గోపీచంద్ డబుల్ రోల్ లో కనిపిస్తాడట. ట్విన్స్ గా పుట్టిన ఇద్దరు అనుకోకుండా విడిపోయి ముప్పై ఏళ్ల తరువాత శత్రువులుగా కలిస్తే ఎలా ఉంటుందనే పాయింట్ తో ఈ సినిమా ఉంటుందట. ఈ సినిమాకు దర్శకుడు తేజ. గోపీచంద్ కి నటుడిగా లైఫ్ ఇచ్చిన దర్శకుడు తేజనే. ‘జయం’ సినిమాతో గోపీకి హిట్ ఇచ్చిన తేజ ఆ తర్వాత తనతో ‘నిజం’లో కూడా ప్రతినాయకుడు పాత్ర పోషింప చేశాడు. అయితే ఆ తర్వాత వీరిద్దరి కలయికలో సినిమా రాలేదు. దాదాపు 18 ఏళ్ళ తర్వాత వీరిద్దరి కలయిలో సినిమా రానుంది. ఇప్పుడు తేజ, గోపీచంద్ కోసం ఓ యాక్షన్ స్క్రిప్ట్ సిద్ధం చేశాడట. ‘అలిమేలుమంగ వేంకటరమణ’ పేరుతో వస్తున్న ఈ సినిమాలో అలిమేలు మంగగా కీర్తి సురేష్ ను ఎంపిక చేసినట్లు వినిపిస్తోంది. మరి రెండో సారి ద్విపాత్రాభినయం చేయబోతున్న గోపీచంద్ ఈ సారైనా హిట్ కొడతాడేమో చూడాలి.