Godse Movie Trailer: మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి.. సబ్జెక్ట్ ఉన్నోడే సర్పంచ్ కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘గాడ్సే’ . ‘బ్లఫ్ మాస్టర్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మించారు. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు.
‘గాడ్సే’ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘సత్యమేవ జయతే అంటారు.. ‘ధర్మో రక్షితి రక్షత: అంటారు. కానీ సమాజంలో సత్యం,ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు’అనే పవర్ఫుల్ డైలాగ్తో ట్రైలర్ మొదలవుతుంది. హీరో సత్యదేవ్ ను పట్టుకోవడం కోసం బ్లాక్ కమాండోలు ప్రయత్నించడం.. అతడిని షూట్ చేయడం వంటివి చూపించారు. ప్రభుత్వ పథకాలు, అవినీతీపై ప్రశ్నించే పాత్రను సత్యదేవ్ పోషించినట్టు అర్థం అవుతోంది.
Also Read
- Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
- Independence Day Special: దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుల కథలు… ఇండిపెండెన్స్ డేకి మస్ట్ వాచ్ సినిమాలు!
- Janhvi Kapoor : పా. రంజిత్ పర్యవేక్షణలో కోలీవుడ్కి జాన్వీ కపూర్ గ్రాండ్ ఎంట్రీ
- Srinu Vaitla : జార్జ్క్రిష్తో కంబ్యాక్ ఇచ్చేందుకు శ్రీనువైట్ల భారీ స్కెచ్
‘పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చింది ఎంత? అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది ఎంత? గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టింది ఎంత? సూట్ కేసు కంపెనీలకు తరలించినది ఎంత?’ అని హీరో చెప్పే మాట రాష్ట్ర ప్రభుత్వాలకు సూటిగా తగులుతుందని చెప్పవచ్చు. ’90 శాతం ప్రజాప్రతినిధులు అఫిడివిట్ చేసి జ్యుడిషియల్ స్టాంప్ వేసుకున్న నామినేషన్ పత్రాలు.. అన్నీ అబద్ధాలే’ అని రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించారు. ‘ప్రశ్నిస్తే..మారణకాండ చేసేస్తారా?’ అనే మాట హీరోకి జరిగిన అన్యాయాన్ని తెలిపింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిదని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
‘అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడో పార్లమెంట్లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి.. సబ్జెక్ట్ ఉన్నోడే సర్పంచ్ కావాలి’, అని సత్యదేవ్ చెప్పే డైలాగ్ రాజకీయ నాయకుల అర్హతను ప్రశ్నించేలా ఉంది. ‘సుజలాం సుఫలం మలయజ శీతలం’ లాంటి పవర్ఫుల్ డైలాగ్స్తో ట్రైలర్ ఓరేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా ఈనెల జూన్17న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఆమె పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ చేశారు. ‘నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే చూస్తుండటం నా వల్ల కాదు సార్’ అని ఆమె చెప్పే డైలాగ్.. ఆ పాత్రలో హ్యుమానిటీని తెలియజేస్తోంది. ఈ చిత్రానికి కళ: బ్రహ్మ కడలి, ఛాయాగ్రహణం: సురేష్ రగుతు, శాండీ అడ్డంకి సంగీతం సమకూర్చారు. జూన్ 17న సినిమా విడుదల ఈసినిమా కోసం ప్రేక్షకులు ఆశక్తి కరంగా ఎదురు చూస్తున్నారు. మరి గాడ్సే సినిమా అభిమానులను ఏవిధంగా ఆకట్టుకోనుందో జూన్ 17 వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
TTD: తిరుమలకు వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్..
-
Heartin OTT Release: జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రియుడు.. ఓటీటీలోకి కితకితలు పెట్టే ట్రయాంగిల్ లవ్ స్టోరీ
-
Harish Rao: బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా? సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్
-
Prajwal Revanna New Case: జైలులో మాజీ ఎంపీ రేవణ్ణకు వీఐపీ ట్రీట్మెంట్.. సెల్లో మొబైల్, పెన్డ్రైవ్ స్వాధీనం
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
ట్రెండింగ్
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!