Godse Movie Trailer: మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి.. సబ్జెక్ట్ ఉన్నోడే సర్పంచ్ కావాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘గాడ్సే’ . ‘బ్లఫ్ మాస్టర్’ వంటి విజయవంతమైన సినిమా తర్వాత గోపి గణేష్ పట్టాభి దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రమిది. సీకే స్క్రీన్స్ పతాకంపై సి. కల్యాణ్ నిర్మించారు. జూన్ 17న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు.
‘గాడ్సే’ ట్రైలర్ విషయానికి వస్తే.. ‘సత్యమేవ జయతే అంటారు.. ‘ధర్మో రక్షితి రక్షత: అంటారు. కానీ సమాజంలో సత్యం,ధర్మం ఎప్పుడు స్వయంగా గెలవట్లేదు’అనే పవర్ఫుల్ డైలాగ్తో ట్రైలర్ మొదలవుతుంది. హీరో సత్యదేవ్ ను పట్టుకోవడం కోసం బ్లాక్ కమాండోలు ప్రయత్నించడం.. అతడిని షూట్ చేయడం వంటివి చూపించారు. ప్రభుత్వ పథకాలు, అవినీతీపై ప్రశ్నించే పాత్రను సత్యదేవ్ పోషించినట్టు అర్థం అవుతోంది.
Also Read
- Vijay Sethupathi : నాడు పూరి సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్.. నేడు అదే పూరి దర్శకత్వంలో హీరోగా!
- Peddi :బుచ్చిబాబుపై SC/ST అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్!
- Anantha Sriram: "విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి 'పెద్ది' బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్డాగ్' టీజర్!
‘పథకాల రూపంలో కేంద్రం నుంచి వచ్చింది ఎంత? అప్పుల రూపంలో ప్రపంచ బ్యాంక్ నుంచి తెచ్చింది ఎంత? గ్రౌండ్ రియాలిటీలో ఖర్చు పెట్టింది ఎంత? సూట్ కేసు కంపెనీలకు తరలించినది ఎంత?’ అని హీరో చెప్పే మాట రాష్ట్ర ప్రభుత్వాలకు సూటిగా తగులుతుందని చెప్పవచ్చు. ’90 శాతం ప్రజాప్రతినిధులు అఫిడివిట్ చేసి జ్యుడిషియల్ స్టాంప్ వేసుకున్న నామినేషన్ పత్రాలు.. అన్నీ అబద్ధాలే’ అని రాజకీయ నాయకుల అవినీతిని ప్రశ్నించారు. ‘ప్రశ్నిస్తే..మారణకాండ చేసేస్తారా?’ అనే మాట హీరోకి జరిగిన అన్యాయాన్ని తెలిపింది. పొలిటికల్ బ్యాక్డ్రాప్లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిదని ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
‘అర్హత ఉన్నోడే అసెంబ్లీలో ఉండాలి. పద్దతి ఉన్నోడో పార్లమెంట్లో ఉండాలి. మర్యాద ఉన్నోడే మేయర్ కావాలి.. సబ్జెక్ట్ ఉన్నోడే సర్పంచ్ కావాలి’, అని సత్యదేవ్ చెప్పే డైలాగ్ రాజకీయ నాయకుల అర్హతను ప్రశ్నించేలా ఉంది. ‘సుజలాం సుఫలం మలయజ శీతలం’ లాంటి పవర్ఫుల్ డైలాగ్స్తో ట్రైలర్ ఓరేంజ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా ఈనెల జూన్17న ఈ చిత్రం విడుదల కానుంది.
ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. ఆమె పవర్ ఫుల్ గవర్నమెంట్ ఆఫీసర్ రోల్ చేశారు. ‘నా కళ్ళ ముందే ఒక ప్రాణం పోతుంటే చూస్తుండటం నా వల్ల కాదు సార్’ అని ఆమె చెప్పే డైలాగ్.. ఆ పాత్రలో హ్యుమానిటీని తెలియజేస్తోంది. ఈ చిత్రానికి కళ: బ్రహ్మ కడలి, ఛాయాగ్రహణం: సురేష్ రగుతు, శాండీ అడ్డంకి సంగీతం సమకూర్చారు. జూన్ 17న సినిమా విడుదల ఈసినిమా కోసం ప్రేక్షకులు ఆశక్తి కరంగా ఎదురు చూస్తున్నారు. మరి గాడ్సే సినిమా అభిమానులను ఏవిధంగా ఆకట్టుకోనుందో జూన్ 17 వరకు ఆగాల్సిందే.
తాజావార్తలు
-
Train Ticket Booking: ప్రయాణికులకు శుభవార్త.. మరింత ఈజీగా బుకింగ్లు.. ఎప్పటి నుంచంటే..!
-
Israel-Iran: ఇరాన్ సీజ్ఫైర్పై ఇజ్రాయెల్ మౌనం.. సర్వత్రా ఉత్కంఠ!
-
Vaibhav: 15 ఏళ్ల వండర్ కిడ్ ‘వైభవ్ సూర్యవంశీ’పైనే అందరి కళ్ళు.. లంక పిచ్లపై భారత్ ‘ఎ’ ట్రై-సిరీస్ పోరు..
-
Mahua Moitra: అమిత్ షా పిలవగానే వెళ్తావా సిగ్గు లేదా.? యూసుఫ్ పఠాన్పై మహువా మోయిత్రా ఫైర్..
-
Kitchen Hacks: వంటగదిలో ఈ చిన్న ట్రిక్స్ తెలిస్తే.. మీ పని సగం తగ్గుతుంది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!