ఒకప్పుడు బాక్సాఫీసును షేక్ చేసే చిత్రాలను అందించిన రాజశేఖర్ కెరీర్ పూర్తిగా డైలామాలో పడిపోయింది. పీఎస్వీ గరుడ వేగ తర్వాత యాంగ్రీ యంగ్ మ్యాన్ హిట్ చూడలేదు. ఒకప్పటి ఈ స్టార్ హీరో ప్రస్తుతం ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి. శ్రీకాంత్, జగపతిబాబులా స్పెషల్ క్యారెక్టర్లకు షిఫ్టవుదామని ఎక్స్ ఆర్డినరీ మ్యాన్లో స్పెషల్ క్యామియో చేస్తే పెద్దగా ఇంపాక్ట్ కాలేదు రోల్. దీంతో ఎటు స్టెప్ తీసుకోవాలో పాలుపోని పరిస్థితి.
Also Read : Anasuya Bharadwaj : ఆహా అనసూయ.. చీరలో మెరుస్తోందయ
రాజశేఖర్ సిచ్యుయేషన్ ఇలా ఉంటే ఆయన వారసురాళ్లుగా ఇండస్ట్రీని ఏలేద్దామని ఎంట్రీ ఇచ్చిన శివానీ, శివాత్మికల పరిస్థితి మరోలా ఉంది. అక్క కన్నా చెల్లెలు ఫస్ట్ తెరంగేట్రం చేసినా పెద్దగా చేసిందేమీ లేదు. చెప్పాలంటే లేటుగా వచ్చిన ఎక్కువ సినిమాలు చేసింది శివానీ. దొరసాని తప్ప మెరుపులు చూపించేలేకపోయిన శివాత్మిక చివరిగా 2023లో వచ్చిన రంగమార్తాండలో కీ రోల్ పోషించింది. శ్రీలీల పెళ్లి సందడితో ఎంట్రీ ఇచ్చిన శివానీ కోట బొమ్మాళిలో మంచి ఫెర్ఫామెన్స్ ఇచ్చింది. ఇక లాస్ట్ ఇయర్ ఓటీటీ కోసం విద్యావాసుల అహం చేసింది. ఈ తండ్రీ, కూతుళ్లు 2023 నుండి వెండితెరను పలకరించింది లేదు అయితే ఈ ముగ్గురు ప్రజెంట్ కోలీవుడ్పై కన్నేశారు. రాజశేఖర్ తమిళంలో హిట్ అయిన లబ్బర్ పందు రైట్స్ కొనుగోలు చేశాడని టాక్. దీన్ని తెలుగులో రీమేక్ చేసే యోచనలో ఉన్నాడని సమాచారం. అలాగే శివానీ మాధవన్ కీ రోల్ ప్లే చేస్తున్న జీడీ నాయుడులో నటించబోతుంది. ఇంజనీర్ జీడీ నాయుడు బయోగ్రఫీ ఆధారంగా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తున్నాడు కృష్ణ కుమార్ రామ్ కుమార్. ఇక చెల్లి శివాత్మిక అర్జున్ దాస్ సరసన బాంబ్ చేస్తోంది. మొత్తానికి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తోంది రాజశేఖర్ ఫ్యామిలీ.