Telangana Murder: దృశ్యం-2 సినిమా చూసి అత్తను హత్య చేయించిన అల్లుడు
- దృశ్యం 2 స్ఫూర్తితో అత్త హత్య
- సిద్దిపేటలో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్త హత్య
- సీసీ కెమెరాలతో బయటపడిన నిజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డబ్బు కోసం మనిషి ఏదైనా చేస్తాడు అని చెప్పడానికి ఈ ఘటన ఓ ఉదాహరణ. తనకి వ్యాపారంలో నష్టం వచ్చిందని ఆ నష్టాన్ని అత్తని హత్య చేసి నష్టం నుంచి బయటపడాలని దృశ్యం 2 సినిమా ప్లాన్ చేశాడో కసాయి అల్లుడు. ఇన్సూరెన్స్ పాలసీలు కట్టించి, ఉన్న భూమి అత్త పేరుపై రాసి కొడుకు లెవెల్ లో బిల్డప్ ఇచ్చి చివరికి కాల యముడిలా మారాడు. అసలు ఈ ఘటన ఎలా బయటపడిందో తెలియాలంటే ఈ స్టోరీ మొత్తం చదవాల్సిందే.
ఈ ఈనెల 7న సిద్దిపేట జిల్లా తొగుట మండలం పెద్ద మాసాన్ పల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీ కొని రామమ్మ అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. రామమ్మ అల్లుడు వెంకటేష్ 100 కి డయల్ చేసి విషయం చెప్పాడు.సమాచారం అందుకున్న పోలీసులు సాధారణ రోడ్డు ప్రమాదమని అనుకున్నారు. అయితే గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు అందులో మహేంద్ర థార్ వాహనం కనపడింది. అయితే ఆ వాహనమే మహిళని ఢీ కొట్టి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. TS 18 G 2277 నెంబర్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు తొగుట పోలీసులు. ఆ వాహనాన్ని సిద్దిపేటలో వెంకటేష్ కి సోదరుడి వరుస అయిన కరుణాకర్ తీసుకున్నట్టు తేలింది.ఈ క్రమంలో పోలీసులకు రామమ్మ అల్లుడుపై అనుమానం కలిగింది. వెంకటేష్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించారు తొగుట పోలీసులు.
Also Read
- Gatta Kusthi 2: "విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది".. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
- Peddi : 400 కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయిన రామ్ చరణ్ పెద్ది
- Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
- "Aadarsha Kutumbam" కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
Also Read:Mayasabha: వైఎస్-చంద్రబాబు స్నేహంపై సిరీస్.. టీజర్ రిలీజ్!
వెంకటేష్ ని రెండు సార్లు ఘటనపై ఏమైనా అనుమానాలు ఉన్నాయా అని పోలీసులు అడగ్గా అలాంటిది ఏమి లేదని చెప్పాడు. అయితే కరుణాకర్ ఎవరిని పోలీసులు ప్రశ్నించగా వెంకటేష్ మాట తడబడింది. ఇక తమదైన స్టైల్లో పోలీసులు విచారించగా అసలు నిజాలు బయటపెట్టాడు అల్లుడు వెంకటేష్. తన అత్త రామమ్మని తానే హత్య చేయించినట్టు ఒప్పుకున్నాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసమే ఇదంతా చేశానని చెప్పుకొచ్చాడు. వెంటనే పోలీసులు తన సోదరుడైన కరుణాకర్ ని అదుపులోకి తీసుకుని పూర్తి సమాచారం రాబట్టారు. ఈ ఏడాది మార్చిలో వెంకటేష్ పౌల్ట్రీ ఫారం బిజినెస్, వ్యవసాయం చేసి 22 లక్షల రూపాయల వరకు నష్టపోయాడు. అలాగే కరుణాకర్ కి అప్పుగా 1.30 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో అప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు.
వ్యాపారంలో వచ్చిన నష్టం నుంచి బయట పడాలనుకున్నాడు వెంకటేష్. వికలాంగురాలైన తన అత్తని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్లాన్ వేశాడు. తన అత్త రామమ్మ పేరుపై 60 లక్షల వరకు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, పోస్టాఫీస్ ఇన్సూరెన్స్ పాలసీలు కట్టాడు. అలాగే ఆమె చనిపోతే మరో 5 లక్షల రూపాయలు రైతు భీమా వస్తాయని తన పేరుపై ఉన్న భూముని కూడా అత్త పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడు అల్లుడు వెంకటేష్. ఓ రోజు తన సోదరుడు కరుణాకర్ ని పిలిచి తనకి ఇవ్వాల్సిన అప్పు ఇవ్వాలని అడగ్గా… కొద్దిగా సమయం కావాలని కోరాడు కరుణాకర్. వెంకటేష్ కరుణాకర్ కి ఓ ఆఫర్ ఇచ్చాడు తన అత్తని హత్య చేస్తే తనకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని అలాగే తన అత్త ఇన్సూరెన్స్ డబ్బులలో ఇద్దరు చేరి సగం పంచుకుందామని చెప్పడంతో కరుణాకర్ ఒకే చెప్పాడు.వెంటనే హత్యకు ప్లాన్ చేశారు.
Also Read:Shreya Dhanwanthary : ముద్దు సీన్ తీసేస్తారా.. సెన్సార్ బోర్డుపై నటి ఫైర్..
ఈ నెల 7న అల్లుడు వెంకటేష్ తన అత్త రామమ్మ దగ్గరకి వెళ్ళి బావి వద్ద విద్యుత్ అధికారులు వస్తున్నారని చెప్పారు. ఆమెని టివిఎస్ ఎక్సెల్ పై మాసాన్ పల్లి శివారు లో రోడ్డు వద్ద ఆపాడు. తాను అధికారులు వచ్చారో లేదో చూసి వస్తాను రోడ్డుపైనే ఉండాలని చెప్పడంతో సరే అంది రామమ్మ. వెంకటేష్ కొద్దిగా దూరం పోగానే కరుణాకర్ కి కాల్ చేశాడు. కరుణాకర్ థార్ వాహనంపై అతివేగంగా వచ్చి రామమ్మని ఢీ కొట్టి హత్య చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి ఏమి తెలియనట్టు వెంకటేష్ ఘటన స్థలానికి వచ్చి తన అత్తని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టి చనిపోయిందని నమ్మించాడు. కానీ చివరికి పోలీసుల విచారణలో అల్లుడి బాగోతం బయటపడింది.
దృశ్యం 2 సినిమా చూసి హత్య చేసినట్టు విచారణలో ఇద్దరు నిందితులు ఒప్పుకున్నారు. అల్లుడి తెలివి చూసి పోలీసులే షాక్ అయ్యారు. సాంకేతికత ఆధారంగా కేసుని ఛేదించిన తొగుట పోలీసులను సిద్దిపేట సీపీ అనురాధ అభినందించారు. మొత్తానికి అత్తని హత్య చేసి సాధారణ మరణంగా చిత్రీకరించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేద్దామన్న అల్లుడి ప్లాన్ బెడిసికొట్టింది. సిసి కెమెరాలు ఈ కేసు ఛేదనలో కీలకపాత్ర పోషించాయి.
- Tags
తాజావార్తలు
-
Gill Batting: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుభ్మన్ గిల్.. రోహిత్ శర్మ రికార్డు పటాపంచల్..
-
Vaibhav Sooryavanshi: మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. కానీ మళ్లీ బయటపడిన అదే బలహీనత
-
IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
-
Gatta Kusthi 2: “విష్ణు విశాల్ పట్టుబట్టబట్టే ‘గట్ట కుస్తీ 2’ సాధ్యమైంది”.. నెట్ఫ్లిక్స్ రిజెక్షన్ టు సీక్వెల్ సీక్రెట్స్ విప్పిన డైరెక్టర్!
-
IND Vs AFG: టీమిండియా ఊచకోత.. గిల్, ఇషాన్ కిషన్ విశ్వరూపం.. భారీ స్కోర్ దిశగా ఇండియా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్కు పండగే.. 12 గంటల పాటు నాన్స్టాప్ ఎంటర్టైన్మెంట్!