చిరు, బాలయ్య, వెంకీ మధ్య దసరా వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా సెకండ్ వేవ్ తో టాలీవుడ్ కుదేలయింది. ఎక్కడ షూటింగ్ లు అక్కడే ఆగిపోవడంతో పాటు పూర్తయిన సినిమాల రిలీజ్ లు ఎప్పుడనే క్లారిటీ కూడా లేకుండా పోయింది. మళ్ళీ పరిస్థితి చక్కబడిన తర్వాతే సినిమాల విడుదల అంటున్నారు. అలా అందరికీ అనువైన సీజన్ గా దసరా కనిపిస్తోంది. ఈ ఏడాది దసరాకి పలువురు బడా స్టార్స్ సినిమాలు సందడి చేస్తాయంటున్నారు. ప్రత్యేకించి చిరంజీవి ‘ఆచార్య’, బాలకృష్ణ ‘అఖండ’, వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాలు దసరాకే వస్తాయని టాక్. అదే నిజమైతే ఆ యా హీరోల అభిమానులకు పండగే. చిరంజీవి కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’గ రాబోతున్నాడు. ఇప్పటికే టీజర్, పాటతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చరణ్ కూడా నటిస్తుండటం ఈ సినిమా అదనపు ఆకర్షణ. ఇక బాలకృష్ణ, బోయపాటి కలయికలో వస్తున్న మూడో సినిమాగా ‘అఖండ’పైనా అంచనాలు ఆకాశమే హద్దుగా ఉన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ యూట్యూబ్ లో సంచలనం సృష్టించటమే దానికి ఉదాహరణ. ఇక వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’ తమిళ సూపర్ హిట్ ‘అసురన్’కి రీమేక్. ఇందులో వెంకీ లుక్ వైరల్ అయింది. ఇప్పుడు ఈ మూడు సినిమాలు దసరానే టార్గెట్ చేయటం గమనార్హం. కోవిడ్ మరో రెండు నెలలలో అదుపులోకి వస్తుందని దసరా పండగ ఆడియన్స్ కి అసలైన పండగ సందడిని అందిస్తుందని అంటున్నారు. ఒక వేళ అనుకున్నట్లు ఈ ముగ్గురు బడా హీరోలు దసరాకే వస్తే వార్ లో విజయం సాధించేది ఎవరన్నది ఆసక్తికరమైన అంశం. లెట్స్ వెయిట్ అండ్ సీ.
Also Read
- Tags
- Balayya
- Chiranjeevi
- Venkatesh
తాజావార్తలు
-
GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్కు..!
-
Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
-
Suriya: సూర్య ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!
-
PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలనతో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్పై మోడీ ట్వీట్
-
Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం