వివాదంలో ‘ఛావా’… చరిత్రని వక్రీకరించారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన మరాఠా పోరాట యోధుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ బయోపిక్ ‘ఛావా’ అంచనాలను మించి రాణిస్తుంది.ఇప్పుటికే 400 కోట్లు కొల్లగొట్టి అదే రేంజ్ లో దూసుకుపోతుంది.ఫైనల్ రన్ 700 కోట్లు అనే ప్రెడిక్షన్స్ వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమాపై రిలీజ్ రోజు నుండి కొన్ని నెగెటివ్ కామెంట్స్, చరిత్రని వక్రీకరించారు అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.
ఛావా పై తాజా కాంట్రావర్సీ మాత్రం మరింత అగ్గిని రాజేస్తోంది. విషయం ఏంటంటే ఈ సినిమాలో శంభాజీ మహారాజ్ ని దగ్గరే నమ్మకంగా ఉంటున్న గనోజి, కన్హోజి అనే ఇద్దరు మరాఠా వీరులు వెన్నుపోటు పొడిచినట్టు చూపించారు.శంభాజీ తమకు అధికారం అడిగితే ఇవ్వలేదు అన్న కోపంతో ఔరంగజేబుతో చేతులు కలిపి శంభాజీ యుద్దానికి సిద్దమవుతున్న సమయంలో దగ్గరుండి మొఘల్ సైన్యానికి పట్టించినట్టు చూపించారు.గనోజి, కన్హోజి ఇద్దరూ కూడా షిర్కే వంశానికి చెందిన వారు.సినిమాలో తమ కుటుంబ పెద్దలను నెగెటివ్ గా చూపించారని, దీని వల్ల తమ కుటుంబం పరువుకి భంగం వాటిల్లిందని,అందుకే ఈ సినిమా దర్శక నిర్మాతలు తమకు 100 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
- Krithi Shetty: కోలీవుడ్లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
- Suhas : సముద్రంలో పడ్డ పీటర్ హెయిన్ .. పైకి లాగాబోతే షాక్!
- Soori : అద్దం ముందు షర్ట్ విప్పేసి.. నా ఒంటిపై ఉన్న గాయాలకు నేనే ముద్దులు పెట్టుకున్నా.
దీనిపై స్పందించిన చావా డైరెక్టర్ లక్ష్మణ్ ఉఁటేకర్ దిగివచ్చి షిర్కే క్షమాపణలు చెప్పారు.’ఎవరిని కించపరచాలి అనేది తమ ఉద్దేశం కాదు.అందుకే ఈ సినిమాలో గనోజి, కన్హోజి పేర్లు మాత్రమే వాడాం తప్ప వారి ఇంటిపేరు కానీ,ప్రాంతం పేరు కానీ వాడలేదు అంటూ చెప్పుకొచ్చారు.మా వల్ల వారికి ఏదైనా ఇబ్బందికలిగి ఉంటే క్షమించాలని కోరారు.
అయితే ఈ క్షమాపణతో వివాదం సద్దుమణిగినట్టు కనిపిస్తున్నా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.శంభాజీని గనోజి, కన్హోజి పట్టించకపోతే మొఘల్ సైన్యానికి ఎలా దొరికాడు?, చరిత్రని నిజంగానే వక్రీకరించారా? అనే అనుమానాలు కలుగుతున్నాయి.నిజానికి శంభాజీ మహారాజ్ అరివీర భయంకరమయిన మరాఠా పోరాట యోధుడు…కానీ ఆయన మద్యం ఎక్కువగా తీసుకునేవాడని,స్త్రీ లోలుడు అని,శివాజీ మహారాజ్ చిన్నతనంలో శంభాజీని స్వయంగా కారాగారంలో వేయించాడని కొంతమంది చెబుతున్నారు.తాను సింహాసనాన్ని అధిష్టించడం కోసం తన పినతల్లిని, ఆమె కొడుకుని కారాగారంలో వేసాడని కూడా కొన్నికథనాలు ఉన్నాయి.ఆ తర్వాత ఆమెకి మరణ శిక్ష విధించాడు అని చెబుతారు కొంతమంది.
అయితే మద్యం మత్తులో ఉన్న సమయంలో శంభాజీని మొఘల్ సైన్యం బంధించింది అని కొంతమంది వాదన. ఏది ఏమైనా? ఛత్రపతి శంభాజీ మహారాజ్ తెగువ,పోరాట పటిమ,యుద్ధ నైపుణ్యం మాత్రం అందరు ఒప్పకునితీరాలి అనేది ఎక్కవమంది అభిప్రాయం.అయితే బయోపిక్ తీస్తున్నప్పుడు,దానికి సంబందించిన పూర్తి ఆధారాలు లేనప్పుడు ఇలాంటి కాంట్రవర్సీలు తప్పవు.త్వరలో తెలుగులో రిలీజ్ కాబోతున్న చావా ఇక్కడ ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో వేచి చూడాలి.
తాజావార్తలు
-
Big Rain Alert: విజయవాడలో వర్ష బీభత్సం.. మునిగిపోయిన రోడ్లు, బ్రిడ్జిలు..
-
BRICS: భారత్కు దౌత్య విజయం.. ‘‘పహల్గామ్ ఉగ్రదాడి’’పై బ్రిక్స్ ఖండన..
-
Ponguleti Srinivas Reddy : భూభారతి వెనుక అసలు కథ ఇదే.. సభలో మంత్రి సంచలన ఆరోపణలు
-
Mayawati: బీఎస్పీ వారసత్వంలో మాయావతి ఊహించని ట్విస్ట్.. అన్న కొడుకులకు నో ఛాన్స్! మేనకోడలికి రెడ్ కార్పెట్..
-
PMKMY: రైతులకు ప్రతీ నెల రూ.3 వేల పెన్షన్.. ఈ స్కీమ్లో జాయిన్ అయితే చాలు..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్తో సెప్టెంబర్ 15న భారత్లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్తో భారత్ దౌత్యం.. చాబహార్తో కొత్త ట్రేడ్ రూట్.!