Cannes 2025: తెలుగు సినిమాకు కేన్స్లో అపూర్వ గౌరవం!
- ప్రపంచ ప్రీమియర్తో చరిత్ర సృష్టించిన ‘M4M’
- తెలుగు సినిమాకు కేన్స్లో అపూర్వ గౌరవం
- రెడ్ కార్పెట్పై సందడి చేసిన మోహన్ వడ్లపట్ల, జో శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా ‘ఎం4ఎం’ (M4M – Motive for Murder) ప్రపంచ వేదికపై తన ఘనతను చాటుకుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, కేన్స్లోని ప్రతిష్ఠాత్మక PALAIS-C థియేటర్లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించబడింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలుగు చిత్ర పరిశ్రమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్ల, నటి జో శర్మ రెడ్ కార్పెట్పై అడుగుపెట్టి గౌరవం పొందారు. స్క్రీనింగ్ అనంతరం ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. తెలుగు సినిమాకు కేన్స్లో ఇలాంటి గౌరవం దక్కడం అరుదైన విజయంగా నిలిచింది.
Also Read: Marriage Incentive Scheme: దివ్యాంగులకు శుభవార్త.. ఆ సమస్యకు పరిష్కారంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం..!
Also Read
- Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
- Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
- Ramayana Release Date : రామాయణ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్..
- Lock Upp 2 Winner: ‘లాక్ అప్ 2’ విజేతగా శ్రేయా కల్రా.. రూ.1 కోటి బహుమతితో గ్రాండ్ విక్టరీ!
ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న జో శర్మ, ఈ ఈవెంట్లో దుబాయ్, ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, నటనా నైపుణ్యం అక్కడి మీడియా నుంచి ప్రశంసలు అందుకున్నాయి. మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన ‘ఎం4ఎం’, కేన్స్ 2025లో ప్రదర్శితమైన ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. బలమైన కథనంతో పాటు సినిమాటిక్ అనుభవం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రీమియర్కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
Also Read:Balakrishna : 10 నిమిషాల కోసం 22 కోట్లు?
తెలుగు సినిమాకు కేన్స్లో ఇటీవల కాలంలో లభిస్తున్న గౌరవం, ‘ఎం4ఎం’ సినిమాతో మరోసారి సాధ్యమైంది. ఈ ప్రీమియర్ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాతగా పేరుగాంచిన మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. జో శర్మ నటన కూడా ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. త్వరలో ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. భారతీయ ప్రాంతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ‘ఎం4ఎం’, విడుదలకు ముందే ప్రపంచ వేదికలపై ప్రశంసలు అందుకుంటూ, తెలుగు సినిమా సత్తాను చాటుతోంది.
తాజావార్తలు
-
Kanika Kapoor: ఆమెలా ఉంటే తప్పేముంది.. సినిమాలో కనిపించేది నేనేగా.. కియారా పోలికలపై కనికా కపూర్ ముచ్చట
-
Jio మాస్టర్ ప్లాన్.. రూ.319కే 18 నెలల Google AI Pro, 45GB హై-స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్..!
-
House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
-
Flop Directors : ఈ దర్శకులకు ఛాన్స్ ఇచ్చే హీరోలెవరు.. నెక్ట్స్ మూవీ కన్ఫ్యూజన్లో ఫ్లాప్ డైరెక్టర్స్
-
Rishabh Pant: మైదానంలోనే కాదు.. ఆర్థికంగానూ రికార్డు బద్దలు.. నంబర్-1 ట్యాక్స్ పేయర్గా రిషభ్ పంత్..
ట్రెండింగ్
-
8,000 నిట్స్ OLED డిస్ప్లే, 8,500mAh భారీ బ్యాటరీ, Kirin 8020 చిప్తో Huawei Nova 16 SE లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ.. ఎగిరెగిరిపడొద్దు.. ఆ ఇద్దరి కెరీర్ ఏమైందో తెలుసుకో!
-
LDAC సపోర్ట్, 32.5 గంటల బ్యాటరీ, స్మార్ట్ డయల్తో CMF Clip Pro ఓపెన్-ఇయర్ ఇయర్బడ్స్ లాంచ్..!
-
Haryana: ఛీ.. ఛీ.. ఇంత దారుణమా? కూతుళ్ల కోసం జీవితాన్ని ధారబోసిన తండ్రి.. వీడియో కాల్లో అంత్యక్రియలు వీక్షించిన కూతుళ్లు!
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!