Cannes 2025: తెలుగు సినిమాకు కేన్స్లో అపూర్వ గౌరవం!
- ప్రపంచ ప్రీమియర్తో చరిత్ర సృష్టించిన ‘M4M’
- తెలుగు సినిమాకు కేన్స్లో అపూర్వ గౌరవం
- రెడ్ కార్పెట్పై సందడి చేసిన మోహన్ వడ్లపట్ల, జో శర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమా ‘ఎం4ఎం’ (M4M – Motive for Murder) ప్రపంచ వేదికపై తన ఘనతను చాటుకుంది. మోహన్ వడ్లపట్ల దర్శకత్వంలో, అమెరికన్ నటి జో శర్మ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం, కేన్స్లోని ప్రతిష్ఠాత్మక PALAIS-C థియేటర్లో రెడ్ కార్పెట్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించబడింది. ఈ వేడుకకు అంతర్జాతీయ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
తెలుగు చిత్ర పరిశ్రమ తరపున దర్శకుడు మోహన్ వడ్లపట్ల, నటి జో శర్మ రెడ్ కార్పెట్పై అడుగుపెట్టి గౌరవం పొందారు. స్క్రీనింగ్ అనంతరం ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు, విమర్శకులు, సినీ అభిమానుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. తెలుగు సినిమాకు కేన్స్లో ఇలాంటి గౌరవం దక్కడం అరుదైన విజయంగా నిలిచింది.
Also Read: Marriage Incentive Scheme: దివ్యాంగులకు శుభవార్త.. ఆ సమస్యకు పరిష్కారంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం..!
Also Read
- Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న జో శర్మ, ఈ ఈవెంట్లో దుబాయ్, ఢిల్లీకి చెందిన ప్రముఖ డిజైనర్లు రూపొందించిన దుస్తులతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆమె ఫ్యాషన్ సెన్స్, నటనా నైపుణ్యం అక్కడి మీడియా నుంచి ప్రశంసలు అందుకున్నాయి. మోహన్ మీడియా క్రియేషన్స్, మ్యాక్విన్ గ్రూప్ USA సంయుక్తంగా నిర్మించిన ‘ఎం4ఎం’, కేన్స్ 2025లో ప్రదర్శితమైన ఏకైక తెలుగు చిత్రంగా నిలిచింది. ఈ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కథ అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగింది. బలమైన కథనంతో పాటు సినిమాటిక్ అనుభవం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రీమియర్కు హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర బృందాన్ని అభినందించారు.
Also Read:Balakrishna : 10 నిమిషాల కోసం 22 కోట్లు?
తెలుగు సినిమాకు కేన్స్లో ఇటీవల కాలంలో లభిస్తున్న గౌరవం, ‘ఎం4ఎం’ సినిమాతో మరోసారి సాధ్యమైంది. ఈ ప్రీమియర్ తెలుగు సినిమా చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచింది. టాలీవుడ్ నిర్మాతగా పేరుగాంచిన మోహన్ వడ్లపట్ల, ఈ చిత్రంతో దర్శకుడిగా అంతర్జాతీయ గుర్తింపు సాధించారు. జో శర్మ నటన కూడా ప్రపంచ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. త్వరలో ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. భారతీయ ప్రాంతీయ సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చిన ‘ఎం4ఎం’, విడుదలకు ముందే ప్రపంచ వేదికలపై ప్రశంసలు అందుకుంటూ, తెలుగు సినిమా సత్తాను చాటుతోంది.
తాజావార్తలు
-
Accident: ఐపీఎల్ ఫైనల్ తర్వాత ఘోర ప్రమాదం.. ప్రాణాలతో బయటపడ్డ మాజీ కెప్టెన్ ..
-
Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
-
Sanjay Malhotra: భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది.. ఆందోళన అక్కర్లేదన్న ఆర్బీఐ గవర్నర్
-
విద్యార్థులకు గుడ్న్యూస్.. విడుదలైన TG PGECET 2026 ఫలితాలు.!
-
TMC Crisis: మమతా బెనర్జీకి మరిన్ని కష్టాలు.. ఇప్పుడు ఎంపీల తిరుగుబాటు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!