NTV Telugu Site icon

Bollywood: బాక్సాఫీస్‌ను షేక్ చేసే కాంబో రాబోతుంది.. ఇక విధ్వంసమే..

Untitled Design (6)

Untitled Design (6)

కొన్ని కాంబినేషన్ల పేరు వింటేనే ఆడియన్స్ లో అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. బోయపాటి బాలయ్య, రాజమౌళి మహేష్, తారక్ ప్రశాంత్ నీల్, లోకేష్ రజనీ ఈ కాంబోలో రాబోతున్న సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. షూటింగ్ స్టార్ట్ చేసిన నాటి నుండి ఈ  క్రేజి కాంబో పట్ల అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.

Also Read : Rashmika Mandanna: ఒకే రోజు రెండు సినిమాలు.. క్రష్మిక క్రేజ్ మామూలుగా లేదు

అటువంటి కాంబోనే మరోటి రాబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. అయితే ఈసారి సౌత్, నార్త్ కలయికలో రానుంది. బాలీవుడ్ ఖాన్ లలో ఒకరు అమీర్ ఖాన్ ఒకరు. త్రీ ఇడియట్స్, దంగల్, తారే జమీన్ పర్ వంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు అమీర్ ఖాన్. కాని ఇటివల ఎందుకనో ఈ ఖాన్ వెనకబడ్డాడు. థగ్స్  ఆఫ్ హిందుూస్తాన్, లాల్ సింగ్ చద్దా వంటి భారీ డిజాస్టర్లతో రేసులో ఈ స్టార్ హీరో వెనకబడ్డాడు. ఈ నేపధ్యంలో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చాడు అమీర్ ఖాన్. ఈ గ్యాప్ లో కథలు వినే పనిలో ఉన్నాడు. ఆ దశలో బ్లాక్ బస్టర్ దర్శకుడి కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అమీర్ ఖాన్. అతడే తమిళ బ్లాక్ బస్టర్ దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఇందుకు సంభందించి కథా చర్చలు కూడా ముగిసినట్టు బాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా టాక్ నడుస్తుంది. ఈ కాంబోకు బీజం వేసింది టాలీవుడ్ టాప్ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ. మైత్రీ నిర్మాతలు చాలా కాలం క్రితం అమీర్  ఖాన్ తో సినిమా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. మెుత్తానికి అది వర్కౌట్ అయినట్టేనని సమాచారం. ఈ ఇద్దరి కాంబోలో రికార్డులు బద్దలవ్వడం ఖాయం.