బాలయ్యకు వీరసింహ రెడ్డి వంటి సూపర్ హిట్ సినిమాను అందించిన గోపీచంద్ మలినేనితో మరో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపధ్యంలో వీరసింహ రెడ్డితో సూపర్ హిట్ ఇచ్చిన గోపీచంద్ మలినేని ఈ సారి సరికొత్త ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటి నుండి అభిమానుల్లో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఈ పవర్ఫుల్ కాంబోను అత్యంత భారీ బడ్జెట్ పై వృద్ధి సినిమాస్ బ్యానర్ లో సతీష్ కిలారు నిర్మించనున్నారు.
Also Read : Prabhas : ఫౌజి.. రాజాసాబ్.. స్పిరిట్.. ఫ్యాన్స్ ను మెప్పించిన అప్డేట్ ఏది?
NBK111 టైటిల్ తో తెరకెక్కుస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ అయింది. నవంబరు 7 తారీఖున ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారు. మాస్ యాక్షన్ అంశాలతో పాటు సినిమా రెండు వేరు వేరు కాలాలకు చెందిన హిస్టారికల్ స్టోరీ అని చరిత్రను.. వర్తమానాన్ని ముడిపెడుతూ ఎపిక్ స్టోరీని రెడీ చేసినట్టు తెలుస్తోంది. ఒకరకంగా టైమ్ ట్రావెల్ లాంటి కథలా ఉంటుందని బాలయ్యను మునుపెన్నడు చూడని విధంగా పవర్ఫుల్ గా ఉండబోతుందట అందుకు తగ్గట్టే దర్శకుడు కొన్ని రోజుల క్రితం మొరాకోలో అనౌన్స్మెంట్ షూటింగ్ కూడా ఫినిష్ చేసాడు దర్శకుడు గోపీచంద్. టెక్నికల్ టీమ్ విషయంలోను ఈ సారి ఎక్కడ కంప్రమైజ్ కావడం లేదు మేకర్స్. ఈ సినిమాకు సీనిమాటోగ్రాఫర్ గా కాంతార కు పని చేసిన అర్వింద్ కశ్యప్ ను తీసుకున్నారు. ఇక సంగీత దర్శకుడిగా బాలయ్య ఆస్థాన వాయిద్యుడు తమన్ వర్క్ చేయబోతున్నారు. బాలయ్య కెరీర్ లో ఈ సినిమా బెస్ట్ వర్క్ ఫిల్మ్ అవుతుందని ఈ చిత్ర కథ తెలిసిన కొందరు టాలీవుడ్ సిర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు. మరికొద్ధి రోజుల్లో బాలయ్య – గోపించంద్ ల యాక్షన్ షురూ కాబోతుంది.