Balakrishna : వీడెందుకు వచ్చాడు.. అభిమానిపై బాలకృష్ణ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘అఖండ 2’ సినిమా ప్రమోషన్స్లో భాగంగా విశాఖ చేరుకున్న బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీనుకు విమానాశ్రయంలో అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్ట్లో అభిమానిపై బాలకృష్ణ ఆవేశంతో ఊగిపోయిన సంఘటన చోటుచేసుకుంది. అభిమానులను నియంత్రించే క్రమంలో బాలకృష్ణ కొంతమేర అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. వారిలో ఒక అభిమానిని చూసి వీడెందుకు వచ్చాడు? అని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :Hidma Diary: సంచలనంగా మరిన హిడ్మా డైరీ.. 27 మంది మావోయిస్టుల అరెస్ట్.. 4 రాష్ట్రాల్లో సోదాలు..
Also Read
- Purusha : సమ్మర్ రేసులో 'పురుష:'.. మే 22న థియేటర్లలోకి!
- NANI : నాని ఫ్యాన్స్కు నిరాశ.. 'బ్లడీ రోమియో' వాయిదా.. 'OG 2'పై సుజీత్ ఫోకస్
- Jo Sharma: ఇలాంటి కాన్సెప్ట్ ప్రపంచంలోనే ఎక్కడా రాలేదు.. విలన్ ఎవరో చెబితే లక్ష ఇస్తాం!
- kannada Heros : హిట్ ఎఫెక్ట్.. భారీ రెమ్యునరేషన్స్ తీసుకుంటోన్న కన్నడ హీరోలు
ఈ సంఘటన అనంతరం, బాలకృష్ణ “సాయంత్రం కూడా వీడు కనపడకూడదు”** అంటూ ఆ అభిమానిని అక్కడి నుంచి పంపించి వేయాలని నిర్వాహకులకు హుకుం జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, సింహాచలం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం చేరుకున్న నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను సింహాద్రి అప్పన్నగా భక్తులు కొలిచే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన బాలకృష్ణ, బోయపాటి శ్రీనులకు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా వారు ఆలయ ప్రాంగణంలోని ప్రసిద్ధి చెందిన కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు.
Also Read :I Bomma Ravi : సజ్జనార్ కు రవి తండ్రి రిక్వెస్ట్… మనవరాలి కోసం..
అనంతరం, ఆలయ గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న ‘అఖండ’ చిత్రానికి సీక్వెల్గా రూపొందుతున్న ‘అఖండ 2’ సినిమా ఘన విజయం సాధించాలని స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిసింది. బాలకృష్ణ నరసింహస్వామి అంటే ఇలవేల్పుగా కొలుచుకుంటారు. అంతేకాక, ఆయనకు తన సినిమాల విడుదలకు ముందు *సింహాద్రి అప్పన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలోనే, ‘అఖండ 2’ ప్రమోషన్స్లో భాగంగా విశాఖ చేరుకున్న వారు ఈ దర్శనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : నేడు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి పర్యటన.. రూ. 364 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన.!
-
Mr. Work From Home : మే 15న థియేటర్లలో ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’
-
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. నేడు ఈ రాశివారు అనుకున్న పని నేరవేరుతుంది..!
-
Posani : “ఆపరేషన్ అరుణారెడ్డి” మొదలెట్టిన పోసాని.. సీఎంగా రఘునందన్ రావు
-
What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?