గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు బుచ్చిబాబు సన కాంబినేషన్లో రూపుదిద్దుకున్న మోస్ట్ అవైటెడ్ మల్టీ-స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ (PEDDI). జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతోంది. ఈ తరుణంలో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచిన మేకర్స్.. తాజాగా ఈ చిత్రం అఫీషియల్ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు సంబంధించి ఇండస్ట్రీలో ఒక సెన్సేషనల్ రూమర్ను వైరల్ చేశారు.
జూన్ 2న ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్ను హైదరాబాద్లో అత్యంత భారీ స్థాయిలో నిర్వహించడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ వేడుకకు టాలీవుడ్ గాడ్ ఆఫ్ మాసెస్, నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారనే క్రేజీ టాక్ ఫిలింనగర్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. కానీ ఈ క్రేజీ కాంబినేషన్ స్టేజ్ పైన సాధ్యమేనా? బాలయ్య రావడానికి ఉన్న బలమైన సమీకరణాలు ఏంటనే దానిపై నెటిజన్లు ఆసక్తికరంగా చర్చిస్తున్నారు. ఎందుకంటే సాధారణంగా వేరే హీరోల ఈవెంట్లకు బాలకృష్ణ రావడం చాలా అరుదు. ఒకవేళ ‘పెద్ది’ వేడుకకు ఆయన వస్తే.. అందుకు ఖచ్చితంగా ఈ రెండు కారణాలే ముఖ్యమైనవి అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకటి బాలయ్యకు, చరణ్కు మధ్య బయట ఎంతో ప్రత్యేకమైన బాండింగ్ ఉంది.
కేవలం చరణ్ పై ఉన్న ఆప్యాయతతోనే బాలయ్య ఈ ఈవెంట్కు వచ్చే అవకాశం ఉంది. లేదా బాలయ్యకు బ్లాక్బస్టర్ హిట్ ‘వీరసింహారెడ్డి’ అందించిన లీడింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్.. ఇప్పుడు ‘పెద్ది’ చిత్రాన్ని సమర్పిస్తోంది. అంతేకాకుండా, ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న తన 111వ భారీ చిత్రాన్ని (#NBK111) కూడా ఇదే మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. తన సొంత నిర్మాతల కోసం బాలకృష్ణ గెస్ట్గా రావడానికి 100% ఛాన్స్ ఉంది. మరి దీని గురించి మూవీ మేకర్స్ నుండి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.
