దక్షిణాది స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి రీసెంట్ గా ‘కూ’ యాప్ లో చేరిన సంగతి తెలిసిందే. ట్విట్టర్ కు ప్రత్యామ్యాయంగా వచ్చిన ఈ యాప్ లో ఇప్పుడిప్పుడే తారలతో పాటుగా అభిమానులు కూడా జాయిన్ అవుతున్నారు. అయితే స్వీటీ మిగితా సోషల్ నెట్వర్క్ లో పెద్దగా యాక్టీవ్ గా ఉన్నది లేదు. కానీ ‘కూ’ లో మాత్రం తెగ జోరు చూపిస్తుంది. ఈ ముద్దుగుమ్మ ‘కూ’ లో చేరిన వారం లోపే దాదాపు 25 వేల మంది ఫాలోవర్స్ వచ్చి చేరారు. అయితే తాజాగా అనుష్క తన బిఎఫ్ఎఫ్ (బెస్ట్ ఫ్రెండ్స్ ఫరెవర్) తో ఉన్న త్రోబ్యాక్ ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘జీవితం గడుస్తున్న కొద్దీ మా మార్గాలు మారవచ్చు, కాని స్నేహితుల మధ్య బంధం ఎప్పుడూ బలంగా ఉంటుంది’ అని అనుష్క మంచి క్యాప్షన్ ఇచ్చారు. ఆమె పోస్ట్ చేసిన వెంటనే, అభిమానులు ప్రేమతో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలావుంటే, అనుష్క కొత్త ప్రాజెక్ట్ కు సైన్ చేసినట్టు తెలుస్తోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రంగా రానున్న ఈ సినిమాలో స్వీటీ ఇద్దరి కవల పిల్లలతో ఒంటరి తల్లిగా కనిపించనుందట. ప్రముఖ తమిళ దర్శకుడు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారని సమాచారం. దీనిపై అధికారక ప్రకటన రావాల్సివుంది.