Anchor Shyamala: SEIZE THE ROAD… అనాలి కదా?.. పవన్ కు యాంకర్ శ్యామల చురకలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘గేమ్ చేంజర్’. ఏపీ ఉప ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా శనివారం రాజమహేంద్రవరంలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు హాజరయ్యారు. వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న టైంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ డీ కొట్టడంతో మరణించారు. ఈ అంశం మీద ఇప్పటికే రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, దిల్ రాజు సంతాపం వ్యక్తం చేశారు. అయితే పవన్ కళ్యాణ్ వీరి మరణానికి వైసీపీ హయాంలో నిర్లక్ష్యంగా వదిలేసిన రోడ్లే అని విమర్శించారు. దీంతో వైసీపీ నేతలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తున్నారు.
Mahesh Babu : సోనూసూద్కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సూపర్ స్టార్ మహేష్
Also Read
- NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
తాజాగా వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ ను విమర్శించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నీతులు చెప్పడం వరకే.. ఆచరణలో ఉండవు. గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు . కాకినాడ-రాజమహేంద్రవరం మధ్య ఉన్న ఏడీబీ రోడ్డు చిద్రమైందని మీకు ముందుగానే తెలిసినప్పుడు ఈవెంట్కి మీరు పర్మిషన్ ఎందుకు ఇచ్చారు సర్ SEIZE THE ROAD… అనాలి కదా? సినిమాలకు రండి, చొక్కాలు చించుకోండి, బైక్ రేసింగులు చేయండి, ఈలలు వేసి గోల చెయ్యండి అంటూ యువతను రెచ్చగొడుతూ మీరు మాట్లాడిన మాటలు ఒక డిప్యూటీ సీఎం స్థాయిలో ఉండి మాట్లాడాల్సిన మాటలేనా మీ కారణంగా ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోతో కనీసం వెళ్లి పరామర్శించారా అంటే మీ స్వార్థానికి అమాయకుల ప్రాణాలు బలి చేస్తున్నారా ఆ అంటూ ఆమె ప్రశ్నించారు.
డిప్యూటీ సీఎం @Pawankalyan గారు నీతులు చెప్పడం వరకే.. ఆచరణలో ఉండవు.
గేమ్ ఛేంజర్ మెగా ఈవెంట్కు హాజరైన ఇద్దరు అభిమానులు రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఈ ఘటనను రాజకీయం చేస్తూ నెపాన్ని గత ప్రభుత్వంపై నెట్టేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నిస్తున్నారు .
కాకినాడ-రాజమ…
— Are Syamala (@AreSyamala) January 6, 2025
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!