NTV Telugu Site icon

Aditya 369: ముచ్చటగా మూడవ సినిమా మొదలెట్టిన ఆదిత్య 369 నిర్మాత.!

Untitled Design (3)

Untitled Design (3)

శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ విభిన్న చిత్రాలు నిర్మించే నిర్మాతగా ఈయనకు పేరు. ఆదిత్య 369 వంటి సినిమాలలో ఆ రోజుల్లో నిర్మించడం అంటే సాహసం అనే చెప్పాలి. ఆ మధ్య ఈ బ్యానర్ లో వచ్చిన సమ్మోహనం సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పించింది. సుధీర్ బాబు హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ తెరెకెక్కించిన ఆ సినిమా సుధీర్ బాబు కెరీర్ లో బెస్ట్ సినిమాగా నిలిచింది. మరోసారి సమ్మోహనం ఈ కాంబో రిపీట్ కానుంది.

Also Read: MechanicRocky : తన పని ముగించేసిన విశ్వక్ సేన్.. ఇక అంతా దర్శకుడిదే..?

శ్రీదేవి మూవీస్ బ్యానర్ లో శివలెంక కృషాప్రసాద్ నిర్మాతగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ముచ్చటగా మూడవ సినిమా చేయబోతున్నాడు. గతంలో వీరిఇరువురి కాంబోలో జెంటిల్ మెన్, సమ్మోహనం వచ్చిన సంగతి తెలిసిన విషయమే. నేడు వీరి హ్యాట్రిక్ సినిమాను ప్రకటించాడు. నిర్మాత శివలెంక కృషాప్రసాద్ తన వ్యక్తిగత ‘X’ ఖాతాలో ” ఇదిగో ‘సమ్మోహనం’గా చిత్రాలు తీసే ‘జెంటిల్మెన్’ ఇప్పుడు ఇదే బ్యానర్ లో గ్రహాల అనుగ్రహంతో మీ ముందుకు తెస్తున్న సినిమా టైటిల్ ని త్వరలోనే ‘దర్శి’oచగలరు. సిద్ధంగా ఉండండి” అంటూ పోస్ట్ చేశారు. తారలు దిగి వచ్చిన వేళా అనే బుక్, రంగుల ఉంగరాలు, బైక్ కీ, బూతద్దం, క్యాలెండర్, కళ్లద్దాలను పోస్టర్ లో చూపిస్తూ సరికొత్తగా ప్లాన్ చేసారు. అయితే ఈ సినిమాలో ప్రియదర్శి, రూపా కొడువాయూర్ హీరో, హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ  చిత్ర టైటిల్ ను కూడా మరికొద్ది రోజుల్లో ప్రకటించబోతున్నట్టు తెలిపారు. మిగతా నటీనటులు, టెక్నిషియన్ల వివరాలు మరికొద్ది రోజుల్లో తెలియజేస్తామని ప్రకటించారు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్.