మంచు విష్ణు-శ్రీను వైట్ల కాంబినేషన్లో 2007 సంవత్సరంలో విడుదలైన ‘ఢీ’ సినిమా సూపర్ సక్సెస్ కావడమే గాక ప్రేక్షకలోకం మరువలేని చిత్రంగా నిలిచిపోయింది. దీంతో ఈ అవుట్ అండ్ అవుట్ కామెడీ మరోసారి చూడాలని ప్రేక్షకులు ఉవ్విళ్లూరుతున్నారు.. ఇప్పటికే దర్శకుడు శ్రీను వైట్ల ‘డి&డి’ టైటిల్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్స్ ఫినిష్ చేశారని సమాచారం. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే తాజాగా శ్రీను వైట్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘డి&డి’ సినిమా ‘ఢీ’ సినిమాకి సీక్వెల్ కాదని తేల్చేశాడు. ఈ చిత్ర కథాకథనాలు పూర్తిగా వేరు అంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ‘దూకుడు 2’ సినిమా కూడా వుంటుందనే వార్తల్లో నిజం లేదని తెలిపాడు. ఇదిలావుంటే, విష్ణు సరసన జాతిరత్నాలు ఫేమ్ ఫరియా నటించనుందని తెలుస్తోంది.