Chiranjeevi : వాళ్ల ఇంటికి వెళ్లి భోజనం చేస్తా.. చిరంజీవి ఎమోషనల్
- లండన్ లో చిరంజీవి పర్యటన
- అత్యున్నత పురస్కారం
- పవన్ గురించి కామెంట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన పురస్కారం లభించిన సంగతి తెలిసిందే. ప్రఖ్యాత లండన్ బ్రిడ్జ్ ఇండియా సంస్థ మెగాస్టార్ కు జీవిత సాఫల్య పురస్కారాన్ని అందించింది. అంతే కాకుండా యునైటెడ్ కింగ్డమ్ హౌస్ ఆఫ్ కామన్స్లో అక్కడి ఎంపీలు మినిస్టర్లు, ఇతర ఎన్నారైలు చిరంజీవిని సత్కరించారు. ఈ సందర్భంగా చిరంజీవి లండన్ లో ఉన్న తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ‘మీతో మాట్లాడుతుంటే నా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్టే ఉంది. మీరంతా ఎప్పుడో ఒక టైమ్ లో నా సినిమాలను లేదా పాటలను విని స్పందించే ఉంటారు. మీ మాటలు నా దాకా చేరుతూనే ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్లతో కలవాలని ఎప్పుడూ ఎదురు చూస్తుంటాను’ అన్నారు.
Read Also : Parigi : హైడ్రా రాకున్నా రెవెన్యూ అధికారుల దూకుడు..
Also Read
- Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
‘మీరందరూ నా అన్నదమ్ములు, అక్కా తమ్ముళ్ల లాంటి వారు. మీ అందరి ఇంటికి వచ్చి నా చెల్లెమ్మల చేతి వంటలు తినాలని ఉంది. ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. కచ్చితంగా ఆ అవకాశం త్వరలోనే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు భేషజాలాలు లేవు. నేను సినిమాల్లో అనుకున్న స్థాయికి వచ్చాను. నా తమ్ముడు పవన్ కల్యాణ్ రాజకీయాల్లో నా ఆశలను కొనసాగిస్తున్నాడు. అతనికి మనందరి ప్రేమ అవసరం ఉంది. మరిన్ని విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం’ అంటూ చిరంజీవి చెప్పుకొచ్చారు.
- Tags
- Chiranjeevi
- pawankalyan
- tour
తాజావార్తలు
-
Mahesh Babu: మహేష్ బాబును కలిసిన స్టార్ డైరెక్టర్.. కథ కూడా చెప్పేశాడు?
-
‘Koh-e-Zafar’ Friendship Dinner: భారత్కు అఫ్గానిస్థాన్ ప్రత్యేక విందు.. ‘కోహ్-ఏ-జఫర్’ పేరుతో ఫ్రెండ్షిప్ డిన్నర్.!
-
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
-
Vaibhav Sooryavanshi: బచ్చా ఆడేందుకు రెడీగా ఉన్నాడు.. వైభవ్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
YS Jagan: నేడు వైసీపీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ కీలక భేటీ.. ప్రధాన అజెండా ఇదే
ట్రెండింగ్
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!