Chiranjeevi : చిరంజీవిపై అసభ్య పోస్టులు.. రెండు కేసులు నమోదు
- చిరంజీవిపై అసభ్య పోస్టులపై సైబర్ పోలీసుల దర్యాప్తు
- రెండు కేసులు నమోదు, 25 పోస్టులు గుర్తింపు
- డిప్ ఫేక్ ఘటనలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
- సైబర్ క్రైమ్ బాధితులు 1930 నంబర్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు : డీసీపీ కవిత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chiranjeevi : సోషల్ మీడియాలో సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని అసభ్యకర పోస్టులు, డిప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వేగంగా దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో డీసీపీ కవిత మీడియాతో మాట్లాడారు. డీసీపీ కవిత వివరాల ప్రకారం.. చిరంజీవి ఫిర్యాదు మేరకు ఇప్పటివరకు రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. చిరంజీవి ఫిర్యాదుతో రెండు కేసులు నమోదు చేసామన్నారు. 25 పోస్టులకు పైగా గుర్తించామని, వాటిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. ఈ వీడియోలు, పోస్టులు ఎక్కువగా ‘ఎక్స్’ (ట్విట్టర్) ప్లాట్ఫారమ్లో ట్రెండ్ అవుతున్నాయి అని ఆమె పేర్కొన్నారు.
Hafiz Saeed: భారత్కు వ్యతిరేకంగా జిత్తులమారి నక్క హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్ ?
Also Read
- Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
- Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
- Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు... బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
- Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
అంతేకాకుండా.. చిరంజీవి ఈ ఘటనపై సివిల్, క్రిమినల్ రెండు మార్గాల్లో ముందుకు వెళ్తున్నారని డీసీపీ కవిత తెలిపారు. చిరంజీవి సివిల్ కోర్టుకు వెళ్ళారన్నారు. క్రిమినల్ కంప్లైంట్ ఆధారంగా మేము కేసులు నమోదు చేశామని, ఎలాంటి ఫిర్యాదు వచ్చినా వెంటనే స్పందిస్తూ సహాయం అందిస్తున్నామని చెప్పారు. డిప్ ఫేక్ టెక్నాలజీని కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తూ మోసం, బ్లాక్మెయిల్ ప్రయత్నాలకు పాల్పడుతున్నారని ఆమె హెచ్చరించారు. “డిప్ ఫేక్ ఘటనలు చిన్నవి కావు. ఇవి మోసం చేయడం, బ్లాక్మెయిల్ చేయడం కోసం వాడుతున్నారు. ఇలాంటి ఘటనలను ఉపేక్షించేది లేదు. కేసులు నమోదు చేసి నోడల్ ఏజెన్సీకి పంపించాం,” అని డీసీపీ కవిత స్పష్టం చేశారు.
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్పై అపోహలు పెట్టుకోవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు. “ఎవరైనా సైబర్ నేరాల బాధితులుగా మారితే వెంటనే 1930 నంబర్కి లేదా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించవచ్చు. తక్షణ చర్యలు తీసుకుంటాం,” అని తెలిపారు. డిప్ ఫేక్ కంటెంట్ పెరుగుతున్న తరుణంలో, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ఫేక్ వీడియోలు షేర్ చేయకూడదని డీసీపీ కవిత సూచించారు.
Traffic Rules : హైదరాబాద్లో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఇక కుదరదు నాయనా..!
తాజావార్తలు
-
Train Safety Tips: ట్రైన్లో ఫ్రీ వైఫై వాడేవారికి బిగ్ షాక్.. ఈ తప్పు చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ!
-
Peddi Nizam : పెద్ది నైజాం బుకింగ్స్ ఓపెన్.. కానీ ఆ థియేటర్స్ ఇంకా పెండింగ్
-
Pandu Master: విశాఖలో రోడ్డు ప్రమాదం.. డాన్స్ మాస్టర్ పండు రెండు కాళ్లకు తీవ్ర గాయాలు!
-
Obsession Collections : 7 కోట్ల బడ్జెట్ తో 1000కోట్లకు పైగా కలెక్షన్లు… బాక్సాఫీస్ లో అదరగొడుతన్న హారర్ థ్రిల్లర్
-
Prabhas : జెట్ స్పీడ్ లో స్పిరిట్ షూట్.. టీజర్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!