మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘భోళా శంకర్’. ఆగస్టు 11న ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ అన్ని సెంటర్స్ లో నెగటివ్ రిపోర్ట్స్ సొంతం చేసుకుంది. వీక్ మేకింగ్ భోళా శంకర్ సినిమాపై విమర్శలు వచ్చేలా చేసాయి. వేదాళం సినిమా తమిళనాడులో సూపర్ హిట్ అయ్యింది అంటే కథలో కచ్చితంగా విషయం ఉంటుంది. ఇక్కడ ఫ్లాప్ అయ్యింది అంటే తెలుగు ఆడియన్స్ కి తగ్గట్లు మార్పులు చేయకపోవడం, మెహర్ ఓల్డ్ స్కూల్ మేకింగ్ లో ఉండిపోవడమే కారణం అయ్యి ఉంటుంది. చిరు వరకూ భోళా శంకర్ గా ఎప్పటిలాగే తన మార్క్ మాస్ ఎలిమెంట్స్ అండ్ కామెడీ టైమింగ్ తో ఇంప్రెస్ చేసాడు. ఈ ఒక్క కారణమే మెగా ఫ్యాన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తుంది. మొదటి రోజు మార్నింగ్ షోకె నెగటివ్ టాక్ వచ్చింది కాబట్టి భోళా శంకర్ సినిమాకి లాంగ్ రన్ ఉంటుందా అంటే కష్టమనే చెప్పాలి.
వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన చిరు నుంచి ఇంకో సినిమా వస్తుంది అంటే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ అవుతాయో అని అందరు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటిదేమి భోళా శంకర్ విషయంలో జరగలేదు. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా భోళా శంకర్ సినిమా 30 కోట్లని కూడా రాబట్టలేకపోయింది. నైజాంలో అయితే భోళా శంకర్ సినిమా నాలుగున్నర కోటి మాత్రమే రాబట్టింది. ఇది చిరంజీవి సినిమాల్లోనే అతి తక్కువ కలెక్షన్స్ లో ఒకటి అనే చెప్పాలి. ఒక యావరేజ్ టాక్ వచ్చే సినిమాని ఇచ్చినా చిరు తన మేనియాతో దాన్ని బ్రేక్ ఈవెన్ మార్క్ చేరుస్తాడు. ఆయన చరిష్మా యావరేజ్ సినిమాని కూడా కాపాడగలదు. మెగా ఫ్యాన్స్ కూడా మంచి ఎలిమెంట్స్ ఉంటే కాస్త అటు ఇటు ఉన్న సినిమాని కూడా సూపర్ హిట్ గా చేస్తారు. మెహర్ రమేష్ కనీసం ఆ అవకాశం కూడా అభిమానులకి ఇవ్వలేదు. ఇక ఇప్పుడు వీకెండ్ కి కలెక్షన్స్ పుంజుకోని ఆడియన్స్ థియేటర్స్ కి వస్తే భోళా శంకర్ సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది లేదంటే బయ్యర్స్ కి భారీ నష్టాలు తప్పేలా లేవు.