నందమూరి బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమా 19 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 25వ తేదీన హైదరాబాద్ దేవి 70ఎం.ఎం ధియేటర్ లో రాత్రి 9 గంటలకు బాలయ్య అభిమానుల ఆధ్వర్యంలో స్పెషల్ షో ప్రదర్శించారు. కరోనా కారణంగా థియేటర్లు కల కోల్పోయి కొత్త సినిమాలే ఫుల్ అవ్వని ఈ టైంలో స్పెషల్ షోలో ఆల్ టైం గ్రాస్ 1,58,682/- కలెక్షన్ వసూలు అయింది. అభిమానుల కేరింతలతో, జై బాలయ్య నినాదాలతో, బాణసంచా వెలుగులతో దేవి ధియేటర్ దద్దరిల్లిపోయి పూర్వ వైభవం కనిపించింది. అన్ని విధాలుగా సహకరించిన సీనియర్ అభిమానులు బి.విశ్వప్రసాద్ రెడ్డికి, కె.యన్.శర్మ కి,కె. శీను కి,కె.అశోక్ కి & దేవి థియేటర్ మనేజర్ గారికి & స్టాఫ్ కి బాలయ్య అభిమానుల కృతజ్ఞతలు తెలియచేశారు.
రెడ్డి గారి రాజసానికి 19 ఏళ్లు
