NTV Telugu Site icon

Brinda Gopal: తగ్గేదే లే అంటున్న స్టార్ కొరియోగ్రాఫర్!

01

01

కొన్నేళ్ళుగా తన కొరియోగ్రఫీతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు బృందా మాస్టర్. అయితే తొలిసారి ఆమె మెగా ఫోన్ చేతపట్టి తీసిన ‘హే సినామిక’ ఈ యేడాది మార్చిలో పాన్ ఇండియా మూవీగా విడుదలైంది. దుల్కర్ సల్మాన్, కాజల్, అదితీరావ్ హైదరీ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మ్యూజికల్ లవ్ స్టోరీకి మిశ్రమ స్పందన లభించింది. దాంతో మరోసారి దర్శకురాలిగా మరో జానర్ లో తన అదృష్టం పరీక్షించుకోవాలని బృందా మాస్టర్ భావిస్తోంది. ‘కన్యాకుమారిలో థగ్స్’ అనే ఈ సినిమాను ఆమె తమిళ, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతోంది. బాబీ సింహా, ఆర్.కె. సురేశ్‌, మునీశ్‌ కాంత్, హ్రిదూ హరూన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది. సి. ఎస్. సామ్ సంగీతాన్ని అందించే ఈ మూవీ పోస్టర్ చూస్తుంటేనే పక్కా ‘రా’ గా, రస్టిక్ గా, రియల్ గా ఇది ఉండబోతోందని అర్థమౌతోంది. మరి ఈ ద్వితీయ యత్నంలో అయినా బృందా గోపాల్ గ్రాండ్ సక్సెస్ ను అందుకుంటుందేమో చూద్దాం!!