Borugadda Anil: పవన్ కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు.. బోరుగడ్డ ఆఫీస్ దగ్ధం!
- గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ ఆఫీసు దగ్ధం
- నిన్న రాత్రి తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
- గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా ఆయన కుటుంబ సభ్యులు మీద అనుచిత వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Borugadda Anil Office Burnt at Guntur: గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా ఆయన కుటుంబ సభ్యులు, కుమార్తెల మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన గుంటూరుకు చెందిన బోరుగడ్డ అనిల్ కుమార్ అనే వ్యక్తికి చెందిన ఆఫీసు దగ్ధమైంది. గతంలో అనిల్ కుమార్ కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జాతీయ కార్యదర్శి లోకేష్ సహా వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడే అందరి మీద బూతులతో విరుచుకుపడుతూ ఉండేవారు. తనకు తాను రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ గా చెప్పుకునే బోరుగడ్డ అనిల్ కుమార్ మాజీ సీఎం వైఎస్ జగన్ తనకు బంధువు అని కూడా చెప్పుకుంటూ ఉండేవారు. ఈ నేపథ్యంలోనే వైసీపీకి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద బూతులతో విరుచుకుపడుతూ ఉండేవారు.
Lavanya Tripathi: మెగా కోడలు లావణ్య త్రిపాఠికి గాయం.. ఏమైందంటే?
Also Read
- Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
- Ghani Movie Failure: 'గని' ఫ్లాప్ కావడానికి కారణం ఇదేనట! తొలిసారి స్పందించిన వరుణ్ తేజ్..
- Tollywood Ticket Prices: టాలీవుడ్లో మళ్లీ టికెట్ రేట్ల చర్చ.. కొత్త కమిటీ ఏర్పాటు చేసిన ఫిల్మ్ ఛాంబర్
- Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
గతంలో ఎన్నికలకు కొన్ని నెలల ముందు కూడా ఆయన ఆఫీస్ మీద దాడి జరిగి, తగల బెట్టారు. అయితే తాజాగా గుంటూరు నగరంలో ఉన్న వల్లూరు వారి తోట ఆరో లైన్ లోని బోరుగడ్డ అనిల్ కుమార్ కార్యాలయానికి నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో క్షణాల వ్యవధిలో మంటలు ఎగిసిపడి ఆ కార్యాలయం పూర్తిగా దగ్ధమైనట్లుగా చెబుతున్నారు. గతంలో తగలబెట్టిన సమయంలో పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటన జరిగినప్పటి నుంచి కార్యాలయంలో ఎలాంటి విలువైన సామాగ్రి ఉంచడం లేదని చెబుతున్నారు. ఇప్పుడు కార్యాలయాన్ని రెనోవేట్ చేస్తున్న నేపథ్యంలో లోపల సామాగ్రి అంతా బయట పెట్టారని, అయితే కొంత ఫర్నిచర్ మాత్రం లోపలే ఉందని చెబుతున్నారు.
నిన్న రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బయటపెట్టిన ఫర్నిచర్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించగా కార్యాలయం మొత్తం దగ్ధమైనట్లుగా తెలుస్తోంది. గతంలో జగన్ తమ చేతులు కట్టేశారు. ఆయన గనుక ఒక్కసారి ఓకే అంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరిని చూడను అరగంటలో అందరినీ లేపేస్తానంటూ బోరుగడ్డ చేసిన వ్యాఖ్యలు ఆయనకు సోషల్ మీడియాలో గుర్తింపు తీసుకొచ్చాయి. అయితే నిప్పు అంటుకున్న ఘటన మీద పోలీసులకు సమాచారం అందించగా వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ ఘటన మీద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!