అలనాటి నటి, మీర్జాపురం రాజా సతీమణి శ్రీమతి కృష్ణవేణికి తను రాసిన ‘ఆటగదరా శివ’ పుస్తకాన్ని అందజేశారు నటుడు తనికెళ్ళ భరణి. రాష్ట్రేతర తెలుగు సమాఖ్య వారు ఘటసాల శతజయంతి స్మారక జీవన సాఫల్య పురస్కారాన్ని కృష్ణవేణికి అందజేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు భరణి. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్రసీమలో కృష్ణవేణి పాత్ర మరచిపోలేననిదని చెప్పారాయన. అంతే కాదు తను రాసిన ‘ఆటగదరా శివ’లోని పద్యాలను పాడి వినిపించారు.