యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలను చేయడానికి చాలా ఆసక్తిని చూపుతుంటారు. తెలుగు బ్లాక్బస్టర్ మూవీ ఛత్రపతి రీమేక్ ద్వారా సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టూవర్టుపురం దొంగ పేరుతో బెల్లంకొండ సురేశ్ ఓ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ టైగర్ నాగేశ్వర రావు బయోపిక్ ఇది. నాగేశ్వరరావు తన జీవిత కాలంలో పోలీసుల నుంచి, జైళ్ల నుంచి ఎన్నోసార్లు చాకచాక్యంగా తప్పించుకున్నాడు. చెన్నై జైలు నుంచి నాగేశ్వరరావు తప్పించుకున్న తీరుతో ఆయనకు టైగర్ అనే పేరు వచ్చింది. పోలీసులను ఎన్నో తిప్పలు పెట్టిన ఈ దొంగ 1987లో పోలీసుల కాల్పుల్లో మరణించాడు. స్టూవర్టుపురంలోని నాగేశ్వరరావు ఇల్లు ఇప్పుడు టూరిస్ట్ స్పాట్గా మారింది. ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఆయన ఫొటో వేలాడుతుంటుంది. మోస్ట్ వాంటెడ్ దొంగగా పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు జీవిత కథను నూతన దర్శకుడు కె.ఎస్. సినిమాగా మలుస్తున్నారు. సీనియర్ నిర్మాత బెల్లంకొండ సురేశ్కు ఇది కమ్ బ్యాక్ మూవీ.
‘1970-80 బ్యాక్డ్రాప్లో తెరకెక్కబోతున్న ‘స్టూవర్ట్ పురం దొంగ’ మూవీలో కమర్షియల్ అంశాలన్నీ తగు పాళ్లలో ఉండేలా వెన్నెలకంటి సోదరులు రచన చేశారని, మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారని, శ్యామ్ కె. నాయుడు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేయబోతున్నార’ని బెల్లంకొండ సురేశ్ తెలిపారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను తెలియనున్నాయి.
