NBK Chiru: ఇప్పుడు చిరుపై బాలయ్యదే పైచేయి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా తెలుగుచిత్రసీమలో పోటీ అంటే మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ మధ్య సాగేదే! దాదాపు నలభై ఏళ్ళ నుంచీ ఈ ఇద్దరు స్టార్ హీరోస్ బాక్సాఫీస్ బరిలో పోటీ పడుతూనే ఉన్నారు. ఇంతకాలం పోటీ పడ్డ స్టార్ హీరోస్ దేశంలోనే వీరిద్దరూ కాకుండా వేరెవ్వరూ కనిపించరంటే అతిశయోక్తి కాదు! విశేషమేమంటే, వీరి తరువాత మరో రెండు తరాల హీరోలు వచ్చి రాజ్యంచేస్తున్నా, పోటీ అంటే మాదే అంటూ సాగుతున్నారు చిరంజీవి, బాలకృష్ణ. అలాంటి ఇద్దరు మాస్ హీరోలతో ఏకకాలంలో రెండు సినిమాలు రూపొందించడమే ఓ విశేషం అనుకుంటే, వాటిని ఒక్క రోజు తేడాతో సంక్రాంతికే విడుదల చేయడం మరింత విశేషం! అలాంటి ఫీట్ తెలుగు సినిమా రంగంలో ఇప్పటి దాకా ఏ నిర్మాణ సంస్థ చేసింది లేదు. ఆ క్రెడిట్ ను మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు యెర్నేని నవీన్, వై.రవిశంకర్ కే దక్కింది. ఈ సంస్థ బాలకృష్ణతో ‘వీరసింహారెడ్డి’, చిరంజీవితో ‘వాల్తేరు వీరయ్య’నిర్మించింది. ఈ చిత్రాల మధ్య పోటీ ఏ స్థాయిలో సాగిందో అందరికీ తెలిసిందే. రెండు సినిమాలనూ ఒకే సంస్థ నిర్మించడంతో అభిమానుల నుండి నిర్మాతలకు ఇబ్బంది కూడా ఎదురయింది. అక్కడే మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలను అందరూ ఇప్పుడు అభినందిస్తున్నారు.
ఎలాగంటే ఓ రోజు ముందుగా అంటే జనవరి 12న ‘వీరసింహారెడ్డి’ విడుదల కాగా, ఆ సినిమాకు మొదటి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చినట్టు ప్రకటించి, బాలయ్య ఫ్యాన్స్ ను సంతోషపరిచారు. తరువాత రోజు జనవరి 13న వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’కు మొదటివారం కలెక్షన్స్ లో రికార్డు చూపించారు. ఇక చిరంజీవి సినిమా, బాలయ్య చిత్రం కంటే ఎక్కువ కేంద్రాలలో యాభై రోజులు ఆడినట్టూ ప్రకటించారు. చిరంజీవిదే బాలయ్యపై పైచేయి అనీ మెగాస్టార్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే మొదట్లో ఎన్ని కలెక్షన్స్, ఎన్ని రికార్డులు ప్రకటించుకున్నా సినీఫ్యాన్స్ కు కావలసింది ఓ సినిమా వంద రోజులు ఎన్ని కేంద్రాలలో ఆడిందన్నదే లెక్క. అక్కడ బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’పై పైచేయి సాధించింది. ఈ మధ్యకాలంలో ఎనిమిది కేంద్రాలలో (మూడు డైరెక్ట్, ఐదు సింగిల్ షిఫ్ట్) శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా ‘వీరసింహారెడ్డి’ నిలచింది. చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ వందరోజుల బొమ్మ వేసి సరి అనిపించారు. ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇలా ఇద్దరు స్టార్ హీరోస్ ఫ్యాన్స్ ను సంతోషంలో ముంచెత్తి తమదైన బాణీ పలికించారు మైత్రీ మూవీ మేకర్స్ అధినేతలు! ప్లాన్ అంటే అలా ఉండాలి మరి అంటున్నారు టాలీవుడ్ జనం!
Also Read
- YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
- Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
- Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
- Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్తో తీర్చుకుంటున్నాడా..?
తాజావార్తలు
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
-
Manisha Koirala: భారత్, చైనా అండగా ఉండాలి.. నేపాల్ వరదలపై కన్నీళ్లు పెట్టుకున్న మనీషా కొయిరాలా..
-
GLOF Risk in India: నేపాల్ వరదల తర్వాత భారత్కు భారీ ముప్పు.. హిమాలయాల్లో 200 ‘జల బాంబులు’?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!