ఎన్టీఆర్-కొరటాల శివ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా దేవర. 2024 లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ సాధించింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి కొరటాలకు సూపర్ కంబ్యాక్ సినిమాగా నిలిచింది. అలాగే బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కు టాలివుడ్ లో తొలి సినిమాతోన బ్లాక్ బస్టర్ ను తన ఖాతలో వేసుకుంది. రాజమౌళి సెంటిమెంట్ ను సైతం బ్రేక్ చేసిన హీరోగా ఎన్టీఆర్ సెన్సేషన్ చేసారు.
Also Read : Mass Jathara OTT : ఓటీటీలోకి మాస్ జాతర.. ఎప్పుడు ఎక్కడంటే?
ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని గతంలోనే ప్రకటించారు.ఫ్యాన్స్ కూడా సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ఈ సినిమా ఎప్పటికప్పుడు వాయిదా పడుతుంది. అటు ఎన్టీఆర్ కూడా ఈ సినిమా తప్ప ఇతర సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. వినిపిస్తున్న టాక్ ప్రకారం ఎన్టీఆర్ ప్రస్తుతానికి ఈ సీక్వెల్ ను చేసేందుకు ఆసక్తి చూపడం లేదని అందుకే ఇతర సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడని తెలుస్తోంది. అయితే గతంలో జరిగిన ఓ సినిమా వేడుకలో దేవర 2 ఉంటుందని ఎన్టీఆర్ ప్రకటించాడు. కొరటాల శివ కూడా ఈ చిత్రం కోసం మొత్తం స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి ఈ ఏడాది చివరిలో షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసినట్లు టాక్ కూడా వినిపించింది. కానీ ఇటీవలి కాలంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎన్టీఆర్ నటించిన బాలీవుడ్ సీక్వెల్ వార్ 2 బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పట్లో సీక్వెల్స్ ను కాస్త పక్కన పెట్టి ఇతర కథలపై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం. మరి ఎన్టీఆర్ కాదంటే కొరటాల శివ నెక్ట్స్ సినిమా ఎవరితో చేస్తారో చూడాలి.