నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి. కళ్యాణ్ రామ్ కెరీర్ లో 21వ సినిమాగా వస్తున్న ఈ మూవీని ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో, అశోక్ క్రియేషన్స్ ,అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మిస్తున్నారు. కల్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్తో రూపొందనున్న ఈ సినిమా అవుట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా గా తెరకెక్కుతుంది.
Also Read : Akhil 6 : ‘అయ్యగారు.. ఆరో సినిమా’ టైటిల్ ఇదే.!
ఇటీవల ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను ఈ నెల అనగా ఏప్రిల్ 18న విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసారు నిర్మాతలు. కాగా ఈ సినిమా ఆంధ్ర థియేట్రికల్ రైట్స్ రూ. 12 కోట్లు పలికింది. అటు రాయలసీమ ఏరియా అయిన సీడెడ్ రూ. 3.70 కోట్లకు డీల్ క్లోజ్ చేసారు. లేటెస్ట్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి నైజాం రైట్స్ డీల్ క్లోజ్ చేసారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ, డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి మూవీస్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాను డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. మరోవైపు ఈ నెల 12న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా యంగ్ టైగర్ రానున్నారు. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పవర్ఫుల్ రోల్ లో నటించిన ఈ మూవీలో సోహెల్ ఖాన్, సాయి మంజ్రేకర్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపిస్తుండగా కాంతార ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ సంగీతం అందిస్తున్నారు.