Bhola Shankar: బోళా శంకర్కు షాక్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ap Governement Refuses Bhola Shankar Ticket Price hike: మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భోళా శంకర్ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన అజిత్ వేదాళం సినిమాని తెలుగు నేటివిటీకి తగినట్లు మార్పులు చేర్పులు చేసి డైరెక్టర్ మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కించారు. షాడో లాంటి డిజాస్టర్ తర్వాత సుదీర్ఘమైన గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో పాటు వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మెగాస్టార్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా రేట్లు పెంచి అమ్ముకుంటామని సినిమా నిర్మాణ సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. సుమారు 25 రూపాయల మేర పెంచుకుని అమ్ముకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. అయితే ఆ అనుమతులు రాకుండానే మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య 200 రోజుల వేడుకల్లో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
Vijay Deverakonda: వారిని చూసి పెళ్లి మీద ఇంట్రెస్ట్ వచ్చింది.. నా పెళ్లి అప్పుడే!
Also Read
- Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
- Pawan Kalyan: ‘నా అన్నయ్యే నా ఏకైక హీరో’.. 'చిరు' పుట్టినరోజున తమ్ముడు ఎమోషనల్ పోస్ట్..!
- Mugguru Kothulu First Look: గాంధీజీ మూడు సూత్రాలతో ‘ముగ్గురు కోతులు’.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్
- Toxic Censor Report: 'టాక్సిక్'కు సెన్సార్ బోర్డు షాక్ ఇచ్చిందా.?
దీంతో ఏపీ ప్రభుత్వం చిరంజీవి మీద విరుచుకుబడింది. మంత్రులు, అధికార పార్టీ నేతలు ఒక రేంజ్ లో ఆయన మీద ఫైర్ అయ్యారు. ఇక ఈ నేపథ్యంలో పెంపు అసాధ్యం అనే ప్రచారం జరిగింది. ఇప్పుడు కూడా పెంపు ప్రపోజల్ను ప్రభుత్వం తిరస్కరించిందని ప్రచారం జరుగుతోంది. నిజానికి భోళా టీం దాఖలు చేసిన దరఖాస్తు అసంపూర్తిగా ఉందని, అవసరమైన మరికొన్ని డాక్యుమెంట్లు జత చేయలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే డాక్యుమెంట్లు సమర్పించాలని భోళా శంకర్ టీం కి చెప్పామని అధికారులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు నిజంగా సినిమా టికెట్ రేటు పెంపుదల ప్రపోజల్ను ప్రభుత్వం తోసిపొచ్చిందా? లేక అది ప్రచారమేనా? అనే విషయం మీద ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ విషయం మీద అధికారులు అధికారికంగా ఏదైనా క్లారిటీ ఇస్తే తప్ప దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే వెల్లడయ్యే అవకాశం కనిపించడం లేదు.
తాజావార్తలు
-
7 సీటర్కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
-
Meerpet Murder : గోనె సంచిలో ఆయా శవం.. మీర్పేట్లో దారుణ హత్య
-
Fishermen: 19 రోజులైనా దొరకని మత్స్యకారుల ఆచూకీ.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..
-
Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
-
Welcome To The Jungle OTT: పొట్ట చెక్కలయ్యే కామెడీతో 192 కోట్ల గ్రాస్.. ఓటీటీలో 24 గంటల్లోనే నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
స్టీరియో స్పీకర్లు, 6 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7,900mAh బ్యాటరీతో POCO M8x 5G వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే!
-
Saturday Horoscope: ఆ రాశివారికి చాలా కాలంగా నిలిచిపోయిన పనులను పూర్తి చేస్తారు.. నేటి దినఫలాలు ఇలా.!
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?