NTV Telugu Site icon

Animal: బాలీవుడ్ కు ధమ్ మసాలా బిర్యానీ రుచి చూపించన్నా..

Animal

Animal

Animal: అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీ ట్రెండ్ ను మార్చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ సినిమాతో టాలీవుడ్ చరిత్ర మారిపోయింది. ఇక విజయ్ దేవరకొండ ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిపోయాడు. అర్జున్ రెడ్డి తరువాత అదే సినిమాను బాలీవుడ్ లో కబీర్ సింగ్ అనే పేరుతో రీమేక్ చేశాడు సందీప్. షాహిద్ కపూర్ నటించిన ఈ సినిమా అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ రెండు సినిమాల తరువాత సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తున్న చిత్రం యానిమల్. రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా యానిమల్ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రణబీర్ లుక్.. ఆ యాక్షన్.. రక్తపాతం మొత్తం అభిమానులను హై లెవెల్ కు తీసుకువెళ్ళింది.

Akkineni Naga Chaitanya: సమంతకు అది ఎక్కువ.. సంచలనం రేపుతున్న చై కామెంట్స్

ఇప్పటివరకు బాలీవుడ్ లో తెలుగు సినిమాల సత్తా.. డబ్బింగ్ రూపంలోనే చూపించారు. ఇక ఇప్పుడు అసలు సిసలు కథతో తెలుగోడి సత్తా చూపించడానికి సందీప్ రెడ్డి దిగాడు. మొన్నటికి మొన్న కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ .. జవాన్ సినిమా తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. ఒక తమిళ్ డైరెక్టరే ఆ రేంజ్ లో చూపిస్తే.. అసలు ఒక తెలుగు డైరెక్టర్ తలుచుకుంటే ఏం చేయగలడో యానిమల్ తో సందీప్ చూపించనున్నాడు. బాలీవుడ్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు తెలుగు హీరోలతో సినిమాలు చేశారు. కానీ, అవేమి ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయాయి. ఇక ఇప్పుడు ఒక తెలుగు డైరెక్టర్.. బాలీవుడ్ హీరోను డైరెక్ట్ చేస్తే ఎలా ఉంటుందో బాలీవుడ్ ఫ్యాన్స్ చూడబోతున్నారు. మొదటి నుంచి కూడా అభిమానులు బాలీవుడ్ కు ధమ్ మసాలా బిర్యానీ రుచి చూపించన్నా అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మరి ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.