Anasuya : ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన అనసూయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి రాశికి క్షమాపణలు చెబుతూ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలో అనసూయ ఒక టీవీ షోలో రాశి గురించి అనకూడని మాటలు అనేసింది. ఒక స్కిట్లో భాగంగా రాశి ఫలాలు అనాల్సింది రాశి గారి ఫలాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది/ అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని రాశి విమర్శించింది. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. కొన్నేళ్ల క్రితం ఒక కామెడీ షోలో నటి రాశి గారిపై వచ్చిన ‘డబుల్ మీనింగ్’ డైలాగుల విషయంలో ఆమె స్పందిస్తూ, రాశికి తన హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు. సుమారు మూడేళ్ల క్రితం ఒక టీవీ షోలో భాగంగా చేసిన స్కిట్లో, అనసూయ నోటి వెంట రాశి గారిని ఉద్దేశించి ద్వంద్వార్థం వచ్చే డైలాగులు వచ్చాయి. అప్పట్లో ఆ డైలాగులు రాసిన రచయితలు, దర్శకులను తాను నిలదీయలేకపోయానని, అది తన వైఫల్యమేనని అనసూయ అంగీకరించారు.
Also Read: Sai Soujanya : భరతనాట్యంతో ఆకట్టుకున్న త్రివిక్రమ్ భార్య సౌజన్య!
Also Read
- Alpha Teaser : ఆలియా భట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ఆల్ఫా' టీజర్ రిలీజ్... గూస్బంప్స్ గ్యారెంటీ!
- God of Masses Birthday Special : నటసింహం 'బంగారు బాలయ్య'.. బర్త్ డే స్పెషల్
- Bharathiraja Special : భారతీయ సినిమా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే దర్శకులు 'భారతీరాజా'
- Peddi : భారీ నష్టాల దిశగా 'పెద్ది' నాన్ తెలుగు స్టేట్స్.. ఓవర్ సీస్ అంతకుమించి?
“అప్పటికి నాకున్న పరిస్థితుల్లో వారిని ప్రశ్నించేంత శక్తి నాకు లేకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా పొరపాటే” అని ఆమె పేర్కొన్నారు. మనిషి కాలక్రమేణా మారుతూ ఉంటారు అనడానికి తానే నిదర్శనమని అనసూయ అన్నారు. ఆ షోలో జరిగిన ఘటన తర్వాత ఆమె తన ప్రయాణాన్ని మార్చుకున్నారని, మహిళల గౌరవం కోసం నిలబడటం నేర్చుకున్నారని తెలిపారు. డబుల్ మీనింగ్ మాటలను ఖండించడం, అలాంటి షోల నుండి బయటకు వచ్చేయడం, మహిళల భద్రత మరియు హక్కుల గురించి గళమెత్తడం నేర్చుకున్నానని అన్నారు. ఈ మార్పులన్నీ తాను ఒక వ్యక్తిగా ఎదిగానని చెప్పడానికి నిదర్శనాలని ఆమె వివరించారు.
Also Read: Chiranjeevi : చిరంజీవికి సర్జరీ?
ప్రస్తుతం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై, ట్రోలర్స్ పైన అనసూయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమెను టార్గెట్ చేస్తూ పాత వీడియోలను బయటకు తీసి ‘హేట్ క్యాంపెయిన్’ నడుపుతున్న వారిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను కించపరచడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలు రాశికి కూడా ఇబ్బందికరంగా ఉండవచ్చునని ఆమె భావించారు. షో నిర్వాహకులు లేదా రచయితలు క్షమాపణ చెబుతారో లేదో తనకు తెలియదని, కానీ ఆ మాటలు తన నోటి నుండి వచ్చాయి కాబట్టి, నైతిక బాధ్యత వహిస్తూ రాశి గారిని క్షమించమని కోరారు అలాగే మహిళల శరీరాల పైన, వారి గౌరవం పైన నిర్మించే తప్పుడు కథనాలను ప్రశ్నించేంత బలం ఇప్పుడు తనకు ఉందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. “గతాన్ని మార్చలేను కానీ, భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోగలను” అనే సందేశాన్ని అనసూయ ఈ పోస్ట్ ద్వారా ఇస్తూ రాశి ఈ విషయాన్ని అర్థం చేసుకుని తనకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తన పోస్ట్ను ముగించారు.
తాజావార్తలు
-
Women’s T20 World Cup 2026కు కౌంట్డౌన్ స్టార్ట్.. భారత్-పాకిస్థాన్ మధ్యే తొలి పోరు.. పూర్తి వివరాలు ఇవే..
-
Sushmita Dev: మమతా బెనర్జీకి మరో షాక్.. రాజ్యసభకు రాజీనామా చేసిన సుస్మితా దేవ్!
-
Sehwag-Dhoni: టీమిండియా నుంచి తప్పించాడు, సీఎస్కేలో స్టార్ను చేశాడు.. ధోనీపై సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు!
-
Alimony: పెళ్లైన 6నెలలకే విడాకులు.. నెలకు రూ.1.40 లక్షలు సంపాదించే మహిళకు.. భరణంగా నెలకు రూ.1.35 లక్షలు
-
అస్థిపంజరాలతో నిండి ఉన్న సరస్సు.. ఈ రహస్యం తెలుసుకుంటే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో Turbo 6X సిరీస్ విడుదల.! ధర ఎంతంటే.?
-
రూ.18,999లకే 144Hz డిస్ప్లే, 8000mAh బ్యాటరీ, మూడు రోజుల బ్యాటరీ బ్యాకప్తో Realme P4R 5G లాంచ్..
-
20 రోజుల బ్యాటరీ, 3000 నిట్స్ AMOLED డిస్ప్లేతో Amazfit Bip Max స్మార్ట్వాచ్ లాంచ్..!
-
Hardik Pandya: షాకింగ్.. తప్పుకున్న హార్దిక్ పాండ్య!
-
Airtel: రూ.1,849తో రీఛార్జ్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్లిమిటెడ్ కాల్స్.!