Anasuya : ఎట్టకేలకు క్షమాపణలు చెప్పిన అనసూయ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి రాశికి క్షమాపణలు చెబుతూ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలో అనసూయ ఒక టీవీ షోలో రాశి గురించి అనకూడని మాటలు అనేసింది. ఒక స్కిట్లో భాగంగా రాశి ఫలాలు అనాల్సింది రాశి గారి ఫలాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది/ అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని రాశి విమర్శించింది. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. కొన్నేళ్ల క్రితం ఒక కామెడీ షోలో నటి రాశి గారిపై వచ్చిన ‘డబుల్ మీనింగ్’ డైలాగుల విషయంలో ఆమె స్పందిస్తూ, రాశికి తన హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు. సుమారు మూడేళ్ల క్రితం ఒక టీవీ షోలో భాగంగా చేసిన స్కిట్లో, అనసూయ నోటి వెంట రాశి గారిని ఉద్దేశించి ద్వంద్వార్థం వచ్చే డైలాగులు వచ్చాయి. అప్పట్లో ఆ డైలాగులు రాసిన రచయితలు, దర్శకులను తాను నిలదీయలేకపోయానని, అది తన వైఫల్యమేనని అనసూయ అంగీకరించారు.
Also Read: Sai Soujanya : భరతనాట్యంతో ఆకట్టుకున్న త్రివిక్రమ్ భార్య సౌజన్య!
Also Read
- Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. 'సూపర్ సుబ్బు'పై సందీప్ కిషన్ హామీ
- Janhvi Kapoor: టాలీవుడ్ తర్వాత కోలీవుడ్పై ఫోకస్.. భారీ వెబ్ సిరీస్తో జాన్వీ కపూర్ డిజిటల్ ఎంట్రీ!
- Shreyas Talpade: ఆ స్టార్ యాక్టర్ సొంతింటి కల నిజం చేసిన షారుఖ్ ఖాన్.. నెట్టింట వైరల్ అవుతున్న క్రేజీ మ్యాటర్!
- Raghav Niharika: బాలీవుడ్ నటుడితో తెలుగు అమ్మాయి లవ్ ట్రాక్? నెట్టింట ఫొటోలు వైరల్!
“అప్పటికి నాకున్న పరిస్థితుల్లో వారిని ప్రశ్నించేంత శక్తి నాకు లేకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా పొరపాటే” అని ఆమె పేర్కొన్నారు. మనిషి కాలక్రమేణా మారుతూ ఉంటారు అనడానికి తానే నిదర్శనమని అనసూయ అన్నారు. ఆ షోలో జరిగిన ఘటన తర్వాత ఆమె తన ప్రయాణాన్ని మార్చుకున్నారని, మహిళల గౌరవం కోసం నిలబడటం నేర్చుకున్నారని తెలిపారు. డబుల్ మీనింగ్ మాటలను ఖండించడం, అలాంటి షోల నుండి బయటకు వచ్చేయడం, మహిళల భద్రత మరియు హక్కుల గురించి గళమెత్తడం నేర్చుకున్నానని అన్నారు. ఈ మార్పులన్నీ తాను ఒక వ్యక్తిగా ఎదిగానని చెప్పడానికి నిదర్శనాలని ఆమె వివరించారు.
Also Read: Chiranjeevi : చిరంజీవికి సర్జరీ?
ప్రస్తుతం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై, ట్రోలర్స్ పైన అనసూయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమెను టార్గెట్ చేస్తూ పాత వీడియోలను బయటకు తీసి ‘హేట్ క్యాంపెయిన్’ నడుపుతున్న వారిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను కించపరచడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలు రాశికి కూడా ఇబ్బందికరంగా ఉండవచ్చునని ఆమె భావించారు. షో నిర్వాహకులు లేదా రచయితలు క్షమాపణ చెబుతారో లేదో తనకు తెలియదని, కానీ ఆ మాటలు తన నోటి నుండి వచ్చాయి కాబట్టి, నైతిక బాధ్యత వహిస్తూ రాశి గారిని క్షమించమని కోరారు అలాగే మహిళల శరీరాల పైన, వారి గౌరవం పైన నిర్మించే తప్పుడు కథనాలను ప్రశ్నించేంత బలం ఇప్పుడు తనకు ఉందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. “గతాన్ని మార్చలేను కానీ, భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోగలను” అనే సందేశాన్ని అనసూయ ఈ పోస్ట్ ద్వారా ఇస్తూ రాశి ఈ విషయాన్ని అర్థం చేసుకుని తనకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తన పోస్ట్ను ముగించారు.
తాజావార్తలు
-
Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
-
Super Subbu: బోల్డ్ సబ్జెక్టే.. కానీ ఫ్యామిలీతో చూడొచ్చు.. ‘సూపర్ సుబ్బు’పై సందీప్ కిషన్ హామీ
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Aarogya Setu 2.0: ఆరోగ్య సేతు 2.0 వచ్చేసింది!.. నిమిషాల్లో OPD బుకింగ్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్..!
-
Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. ‘నా వ్యాఖ్యల్లో తప్పు లేదు’..!
ట్రెండింగ్
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Gautam Gambhir: అయ్యా బాబోయ్.. గంభీర్ మాకు కోచ్గా వద్దు.. పసికూన క్రికెట్ బోర్డు ఎద్దేవా!